Friday, November 20, 2015

పంచాయతీ రాజ్

పంచాయితిసెక్రెటరీగా నా జాబ్ ప్రొఫైల్ చూసిన నా మిత్రుడొకడు ఏదైనా సేవాసంస్థకి సెక్రేటరీగా పని చేస్తున్నావా అని ప్రశ్నించాడు. ఆది అతని విఙ్ఙానానికి సంబందిoచిన ప్రశ్నే కావొచ్చు...కానీ పంచాయతీరాజ్ ఎంత అత్యున్నతమైన వ్యవస్థో... అంతస్థాయిలో ప్రజలలో ఇంకా మిళితంకాలేదేమో? అని నాకనిపించింది. ఆయితే గత కొంతకాలంగా దీనిలో ప్రగతికారక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నది వాస్తవం. ఈ సందర్బంగా నేను వుద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గురించి నాకు అర్ధమైనంతవరకూ అందరితో పంచుకొవాలని నేను రాస్తున్న వ్యాసం ఇది.
6,40,867గ్రామాలు కలిగి, 69శాతం జనాభాని భరిస్తున్న భారతదేశపు గ్రామీణవ్యవస్థ పరిపాలనలో పంచాయతీరాజ్ విధానం అత్యున్నతమైన అధికారపు కేంద్రం. దీనికింత విలువవుండబట్టే భారతరాష్ట్రపతికి కూడా లేని చెక్ పవర్ గ్రామపంచాయతీకి చెందిన ప్రజాప్రతినిధి అయిన సర్పంచ్ కి ఇవ్వబడింది. అంతగొప్ప వ్యవస్థ గురించి మనమంతా తెలుసుకోవాల్సివుంది. నేను ఈ వ్యవస్థలో వుద్యోగిగా చేరి 500రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నాకు అవగతమైన విఙ్ఞానాన్ని మీముందుంచుతున్నాను. ఇది నేను నా గ్రూప్ 1 ప్రిపరేషన్లో భాగంగా ఒకప్పుడు తయారుచేసుకున్నదే అయినా ప్రస్తుతం నాకు దొరికిన మరికొంత ప్రత్యక్ష విషయ అవగాహనతో కూర్చి రాస్తున్నాను. తప్పులుంటే నాకు తెలియచేసి దిద్దుకునే అవకాశం ఇవ్వగలరని ప్రార్ధన.
ఈ వ్యాసాన్ని కొన్ని భాగాలుగా విస్తరిద్దాం.
1.పంచాయతీ రాజ్ అంటే ఏమిటి?
2.పంచాయతీరాజ్ ఏర్పడిన నేపద్యమేమిటి?
3.పంచాయతీరాజ్ బలపడటానికి తీసుకున్న నిర్ణయాలేమిటి?
4.పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరు ఏలావుంది?
5.పంచాయతీరాజ్ లో విజయాలు
6.పంచాయతీరాజ్ లొ దోషాలు
7.పంచాయతీరాజ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రగతికారక చర్యలు
8.పంచాయతీరాజ్ మరింత విజయానికి తీసుకోవాల్సిన చర్యలు- నా సమీక్ష.
ప్రతీ రెండురోజులకూ ఒకసారి ఒక్కొక్క పాయింట్ తో మీ ముందుకొస్తాను.
శ్రీఅరుణం[పి.శ్రీనివాసరావు]
పంచాయతీ సెక్రేటరి
చొంపి & శిరగం గ్రామపంచాయితి...
అరకువేలీ మండలం
విశాఖ జిల్లా
9885779207

Thursday, July 16, 2015

వాలుకుర్చిలో జ్ఞాపకాలూ
[జీవితం అనుభవించడానికి. దాచుకోవటానికి కాదు. చాలామంది ఆర్ధికమైన విషయాలలో పడి హార్ధికమైన ఆస్వాదనని కోల్పోతున్నారు.ఆ లెక్కలచిట్టాలు పట్టుకొని పరిగెత్తే గమ్యం చేరువయ్యాక...తాము ఏదో కోల్పోయామని తెలివి తెచ్చుకొని వేదన పడుతున్నారు. అలాంటి జీవితం ఒకటి...... అనుభవించిన ఆశల నెమరువేత ఈ వాలుకుర్చీలో ఙ్ఞాపకాలు కవిత. సంపాదన వుచ్చులో హద్దుకు మించి పరుగులు పెట్టిన ఆయన చివరి రోజులలో...... తనకోసం ఎంతో ఎదురుచూసి, ఆఖరి చూపు కూడా నోచుకోని భార్య మనసు పడిన క్షోభను గుర్తుచేసుకుంటూ అనుభవించిన క్షణాలు ఇవి.ఆయన చెప్పిన తన ఙ్ఞాపకాలనుండి...వారి కోరికమేరకు నేను రాసిచ్చిన కవిత ఇది.]
నిజం చెప్పు నేస్తం నా నమ్మకం నిలిచేవుందా?
నేను నిలిచిన నీ గుండెలో ఇంకా మొలకెత్తుతూనే వుందా?
నాకు రింగ్ ఇచ్చిన సెల్ కాల్
అవుటాఫ్ కవరేజ్ ఏరియా అంటూ,
నా దూరం చెబుతూ వుంటే..
పీడకలలాంటి ఆ కవరేజీ నీ కడుపుని ఎన్నా ళ్ళని ద్రేవేసిందో?
నీకు గుర్తుందా?నా మొదటి రాక...
నీ హ్రుదయపు వాకిళిలోకి,
కాఫీఇచ్చి, ఉప్మా పెట్టి, మజ్జిగ త్రాగించావు.
ఏంటిరా ఇది కన్నా అంటూ..కంటి పుసిని తుడిచావు.
నువ్వు తినిపించిన ఆ ప్రేమఎక్కడ నెమరువేస్తానోనని.
యెంత జాగ్రత్తగా కాపాడుకున్నానో!!!
కానీ.......
కాలం చూపిన ప్రతాపంలో మొదలుపెట్టిన పరుగులో ఏదో శాపం తగిలింది???
అలాంటి శాపగ్రస్తజీవనంతో...గడచిన కాలం,
నా మీద నీ ప్రేమని తగ్గించలేదని చెప్పు నేస్తం
అక్కడే..
నీ పాదాల చెంతనే వుంది నా ప్రాణం.
కనుచుపుమేరవరకూ సోకర్యాలు,
పర్సునిండా కుక్కిన క్రెడిట్ కార్డులు,
గ్లోబుతో పాటూ తిరిగే పనులు ,
ఇంకా....ఎన్నెన్నో...
ఎంటర్ నొక్కితే చాలు..ఏకంగా స్వర్గాన్నే ముందుంచుతున్నాఇ,
కానీ...
ఆ పచ్చని చేలో,
పూరిగుడిశెలో,
దూరంగా పలకరిస్తున్నసముద్రపు అలల హోరులో,
నువ్వు తెచ్చిన ఇడ్లీ ఆవకాయా తింటూ ..
మనం అనుభవించిన పరవశాలు..
ఒక్క గంట..కాదు కాదు,
ఒక్క నిముషం..అదీ కాదు,
ఒక్క క్షణం..ఇస్తానని చెప్పు నేస్తం,
ఈ క్షణమే వాలిపోతాను నీ దోసిళ్ళలోకి.
ఊ!!!
యాభై వసంతాలు గడిచిపోయాఇ,
అందులో...నిన్నుపొందిన మూడుదశాభ్దాలూ వెళ్ళిపోయాఇ.
ఒక్కసారిగా వాలుకుర్చిలో నడుంవాల్చిన ఙ్ఞాపకాలు..
కోల్పోఇన సాంగత్యాన్ని నెమరువేసుకుంటుంటే..
వయసు మీరిన తర్వాతి ముందు జాగ్రత్త.. మందులే మింగేస్తున్నాఇ.
పిల్లల బంగారు భవిష్యత్తు..విదేశాలకు ఎగిరిపోఇంది.
అందమైన ఇల్లు కాపలాకాయటానికే సరిపోతుంది.
అందుకోలేనంత హోదా కాపాడుకోడానికే పనికొస్తుంది.
ఆఖరిఖి ఈరోజున..
సంవత్సరానికి పది చొప్పున,నీకు కేటాఇంచిన రోజులు..
నిన్ను ఎంత వేదనకు గురిచేసిందో???
ఖరీదుగా కట్టించిన నీ సమాధిమాత్రమే చెబుతుంది!
ఎంత ఖర్చుపెట్టినా...ఇప్పుడు నువ్వున్నది స్మశానంలోనని.
శ్రీఅరుణం[పి.శ్రీనివాసరావు]
పంచాయతీ సెక్రేటరి
చొంపి & శిరగం గ్రామపంచాయితి...
అరకువేలీ మండలం
విశాఖ జిల్లా
9885779207

Thursday, March 19, 2015

ఒక పని సాధించాలంటే దానికై చూడవలసిన భిన్న కోణాలుంటాయి. వాటన్నిటినీ సమ్మిళితం చేయటంలో మనం సంపాధించుకున్న విఙ్ఞానమే వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. సహజంగా ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని అభివృధ్ధి చేసుకోవటానికి తన జీవిత విధానాన్ని మార్చుకోగలిగితే చాలనుకుంటారు. కానీ మానవుడు సంఘజీవిగా తనతో పాటూ బ్రతుకీడుస్తున్న సమాజంలో అతని వ్యక్తిత్వవికాసం తనతోనే కాక, ఎదుటి వారినుండి కూడా ప్రభావితమవుతూ వుంటుదని మర్చిపోకూడదు. అందులో భాగమే కనుక  బయట ఇంటర్వూలకు వెళ్ళేటప్పుడో, పదిమందిలో ప్రత్యేకంగా కనిపించటానికో, సమాజంలో అందరికంటే ముందుగా పరిగెత్తటానికో మాత్రమే మన వ్యక్తిత్వ వికాసానికి కావలసిన వివిధ అంశాలను నేర్చుకోవాలని చాలామంది నమ్మకం. అది మన పనికి మంచి ఫలితాన్నిస్తుంది, నిజమే.అయితే ఆ వ్యక్తిత్వం మనకొక కోర్స్ లా కాకుండా, మన జీవితంలా మార్చుకోగలిగితేనే `నువ్వు` అనేది ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం అవుతుంది. అందుకు కొన్ని లక్షణాలు కావాలి. అవి...
1.డ్రస్ కోడ్
2.సంభాషణ
3.ఎదుటివారిని గౌరవించటం
4.సంధర్బోచిత విఙ్ఞానప్రదర్శన
5.ముగింపునివ్వగల సమర్ధత
from my book "anthar bhramanam"

“శ్రీఅరుణం”
9885779207

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.