Monday, August 19, 2013

మహాభారత ఉధ్యమం

మీరు చదువుతున్నది కరెక్టే. నేను రాయబోతున్నది మహాభారతంలో జరుగుతున్న  ఉద్యమం గురించే. అందుకే ఆ పేరు పెట్టాను.
ఒక రాజ్యం వుండేది.దాన్ని ఇద్దరు అన్నదమ్ములు తమకున్న శక్తియుక్తులతో నిర్మించుకొని అభివృద్ధి చేసుకున్నారు. వారిద్దరికీ ఒకే ఆశయం వుంది కనుక మరో ఆలోచనలేదు.కానీ కాలక్రమంలో జరిగిన మార్పుల దృష్ట్యా వారి కుమారుల మధ్యన సొంత ఆలోచనలు మొదలైయ్యాయి. అవి  రాజ్యం విషయంలో భాగాలుగా మారి, పంపకాల కొరకు వాదనలు మొదలైయ్యాయి.  ఆ వాదన యుద్దానికి దారితీసింది.అందులో విజయం ఆధారంగా సమస్యకు పరిష్కారం లభించింది, స్థూలంగా ఇదీ కధ అంటూ ముగిస్తే ఎవరైనా సులువుగానే సమాధానం చెప్పేస్తారు "మాహాభారతం" అని.
మరి, ఆ మాత్రం కధ ఒక అత్యున్నతమైన గ్రంధరాజంగా ఎలా మారింది?
గొప్ప పురాణంగా...
పద్దేనిమిది పర్వాల రచనగా...
అందూలోనూ ఉపకధలూ, పిట్టకధలూ నిండిపోయి...
కొన్ని వందల వ్యక్తిత్వాలూ, వాటి చరిత్రలూ అనే
సందేహాలూ, మరెన్నో సూత్రాలూ వీటన్నిటితో నిండిన విభిన్న అంశాల సమాహారం అది. ఎంతో సుధీర్ఘమైన ఆ పరంపరలో భిన్నత్వంతో కూడిన ఏకత్వం కోసం పాటుపడుతున్న భావనని చాటిచెప్పే భగవానుని స్తుతి అంతర్లీనంగా గోచరిస్తూనే ఉంటుంది. ఇవన్నీ వున్నా కక్షలూ కార్పణ్యాలూ నేరాలూ దోషాలూ ప్రతీచోటా మనకు అందులో దర్శనమిస్తూనే వుంటాయి. ఇంతాచేసి మనకు దానినుండి లభించే ప్రధాన అంశం  కేవలం ఒక రాజ్యం, రెండు భాగాలు. ఇదే.
మరెందుకు భారతం మహాభారతం అయ్యింది? అయినా పరవాలేదు.ఎందుకంటే ఆ రోజుల్లో యుద్దం అనేది రాజుధర్మం కనుక పరిష్కారం తొందరగానే దొరికింది.
మరి...ఈ రోజుల సంగతేంటి?
ప్రజలకొరకు, ప్రజల చేత, ప్రజలే నిర్మించుకున్న ప్రజాస్వామ్య రాజ్యంలో రెండు వర్గాలవారు ఎవరుంటారసలు?
"మా కోసం మేము తయారు చేసుకొని, మాకు మేమే సమర్పించుకుంటున్నాము" అని పూజించుకొనే రాజ్య[గం]ధర్మం ధిక్కరిస్తున్నవారు ఆ ప్రజలుకాక మరింక ఎవరు?
కుల,మత,వర్గ,భాష,ప్రాంతీయ...ఇంకా ఎన్నివుంటే అన్నిరకాల విభిన్నత్వాలకు అతీతంగా ఏర్పడిన వ్యవస్థలో ఉధ్యమం పేరిట తలెత్తుతున్న వివాదాలూ, విధ్వంసాలూ,ఆరోపణలూ ఎవరు? ఎవరిమీద? ఎవరికోసం చేసుకుంటున్న ఉన్మత్తాలు!!!
వీటన్నిటికీ రూపమే ఈ మహాభారత ఉధ్యమం .
మొదట నేనుకూడా ఈ విషయంలో ఏదో ఒక విషయానికి మాత్రమే పరిమితమైపోయిన సంకుచితత్వంతో ఎగిసిపడ్డాను. కానీ, అన్నిటికంటే అత్యున్నతమైన నా అంతరాత్మ నన్ను నిలదీసినప్పుడు...నాలో నిలిచిన ఒకే ఒక్క భావన "నేను ఒక భారతీయుడని"అన్న నిజం. ఆ నిజమే నాతో ఈ రచన రాయటానికి అర్హతనిచ్చింది.అదే భావనతో ఈ రచన చదవండి.  తరువాత మీ అంతరాత్మ ప్రభోధం ఎప్పుడూ మీతోనే వుంటుందిగా.ఆలోచించండి.
20 ఆగస్ట్  బుధవారం ఇక్కడే మొదటిభాగం కోసం కలుద్దాం.
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం. 




 





atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.