Friday, September 27, 2013

మహాభారత ఉధ్యమం part7


ఆ సిద్ధాంతం ఎప్పుడు మొదలైoదో...అప్పుడే మహాభారత ఉద్యమానికి మనిషిలో అంకురార్పణ జరిగింది. ఆ మహాభారత సంగ్రామంలో పాండవులు,కౌరవులే రెండు పరస్ఫర అస్థిత్వాలు. కానీ ఈ మహాభారత ఉద్యమంలో ఎన్నో అస్థిత్వాలు మనిషిలోని స్వార్ధానికీ ఆవేశానికీ అవసరానికీ హేతువులుగా పుట్టుకొస్తున్నాయి.
ఒకవైపు మతం...మరోవైపు చాందసం
ఒకవైపు అభివృద్ధి...మరోవైపు వెనకబాటుతనం
ఒకవైపు కులం...మరోవైపు అణచివేత
ఒకవైపు పేదరికం...మరోవైపు అవినీతి
ఒకవైపు భాష...మరోవైపు ఆవేశం. 
ఇలాంటి వాటితో తాత్కాలిక యుద్దానికి తెరతీయటందానికోసం మిఠాయిలు పంచే చలివేంద్రాలను దోసిళ్ళలో పోయటం... ప్రస్తుతం జరుగుతున్నదదే.  అందువల్లేనేమో ఇప్పుడు ఏఉద్యమానికీ ఒక నిర్ధిష్టమైన దిశా, కారణం, సిద్ధాంతం, ఫలితం...,లేకుండాపోయాయి. వాటిన్నిటికి మార్గనిర్దేశం చేయాల్సిన రాజ్యాంగం సవరణల పోట్లతో దారుణంగా మోసపోతుంది.  చివరికి ఈ వ్యవస్థ రాజకీయం - అధికారం అనే రెండు పాత్రలతో నడిచే నాటకానికి ప్రదర్శనశాలగా మిగిలిపోయింది. అలా వదిలేద్దామా? లేక... మన భవిష్యతుకోసం, మన తరువాత తరాల మార్గం కోసం మరోసారి మనల్ని మనం సమీక్షించుకుందామా?
 ప్రస్తుతం నేను ఈ రచన ద్వారా చేస్తున్నదదే.
ఎన్ని విధానాలు వచ్చినా
ఎన్ని యుగాలు మారినా
ఎన్ని ప్రవచనాలకు తలవూపినా... "ప్రతీ మనిషీ ఎప్పటికీ ఒక ప్రత్యేక శక్తే" అన్న అంబేద్కర్ గారి మాటలు మన భారతావనికి అక్షరసత్యాలు. ఆ ప్రత్యేక అతనిలో వుండబట్టే ఎన్ని దాటుకొని వచ్చినా ఎప్పుడూ మార్పుకోసం సాగుతూనేవున్నాడు. అత్యంత గొప్ప నాగరిక ముంగిట్లో నిలిచామనుకుంటున్న ఇప్పటి మనిషి, నిజానికి ఒక రోబోట్ లా మారిపోయానని తెలుసుకోలేకున్నాడు. అదే మన ధౌర్భాగ్యం. దేశం ఇప్పుడు బ్లాక్ బోర్డ్ లా తయారయ్యింది. ఎవడికి కావలసినదానికోసం వాడి అవకాశాన్నిబట్టీ ఒక వాదమో... సిద్ధాంతమో... ఉద్యమమో... పుట్టిస్తున్నాడు. దానికి ఆ బ్లాక్ బోర్డే ఒక మార్గం. దానిపై తనకు కావలసినదానికొరకు 
ఎందరు?  
ఎలా?  
సమకూరుతారో లెక్కలుకడతాడు..వాడి లెక్కలు తేలేసరికే,  పాత లెక్కలమూటలు దాచుకున్న బ్రోకర్లు చుట్టూ చేరుతుంటారు. అలా చేరిన ముఠా అంతాకలిసి దేశ ప్రజల సంఖ్యకీ తమకీ కావలసిన అవసరానికీ మద్యన ఎలా చిచ్చు రగులుతుందో నిర్ణయించుకుని, దానికి చరిత్రను మేకప్ గా వేసి రంగంలోకి దిగుతున్నారు. అంతే అశోకుడినీ,అక్బర్ నీ,మహాత్ముడినీ ఆఖరికి తాము నిర్మించుకున్న రాజ్యాంగాన్నే నమ్మని మనమంతా... ఆ చరిత్రని పట్టుకొని చేతబడిచేసినట్లు ఉద్యమాలకి బయలుదేరుతున్నాం. ఇలా బయలుదేరినవారిలో...
పనులు మానుకున్నవారున్నారు
ప్రాణాలు అర్పిస్తున్నవారున్నారు
నిజానికీ వాస్తవానికీ మద్యన తేడాని గుర్తెరగని వారున్నారు.
ఒక్క క్షణం ఆగండి. ఆలోచించండి, నిజానికీ వాస్తవానికీ మద్యనున్న తేడా.
నిజం...ఉన్నదాన్ని గురించి తెలుపుతుంది.
వాస్తవం...జరుగుతున్నదాన్ని గురించి తెలుపుతుంది.
ఈ రెండింటి మద్యనున్న ఆ సున్నితమైన పొరను చూడలేని కళ్ళు నిజమైన అభివృద్ధిని ఎప్పటికీ చూడలేవు. అలాంటి చీకటియుగంలో వుంటూ ఎప్పుడో అభివృద్ధీ సాధిస్తామని శతాబ్దాలు వేచివుండే జఢత్వం నుండి బయటకి వద్దాం. ఆ నమ్మకం కోసం మన ముందు మరాలి. అందుకోసమే మహభారత ఉద్యమాన్ని అన్నికోణాలనుండి సమీక్షించుకోవాలి.  దానికి నిజమైన ఆధారం మన రాజ్యాంగమే. దానినుండే నేను నా తరువాత ఉద్యమకోణాన్ని రచించబోతున్నాను.
శ్రీఅరుణం.
మీ అభిప్రాయాలను పంపండి.
sssvas123in@rediffmail.com
no : 9885779207
facebook - sriarunam rao
నా కవితల కోసం sarithasrinivasam.blogspot.com చూడండి.

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.