Saturday, September 21, 2013

మహాభారత ఉధ్యమం Part 6


"డిస్కవరీ ఆఫ్ ఇండియా" నెహ్రూగారి ఈ పుస్తకం చదివినప్పటినుండీ నా మదిలో సుడులు తిరుగుతున్నవి రెండు విషయాలు.
ఒకటి భారతదేశం,
రెండు భిన్నత్వంలో ఏకత్వం.
ఇప్పటికీ ఆ మాటను మనం ఉపయోగించుకుంటున్నట్లుగా మరెవరూ ఉపయోగించుకోలేరేమో. నిజానికి రెండు చిన్నపదాల మద్యన వాక్యంపేరిట వేసిన అత్యున్నతబంధం అది. కానీ ఇప్పటికీ అవి మనకు వేర్వేరు పదాలుగానే కనిపిస్తున్నాయి. ఎప్పటికీ వాటిని వాక్యంగా మనం నమ్మమేమో అనిపించేలా దేశం నిత్యం ఉద్యమాలతో రగులుతూనే వుంది. అడపాదడపా ఏకత్వం అనేది ఎప్పుడైనా వినిపిస్తుందంటే...అది
విదేశీ దాడులప్పుడో..
దేశపు క్రీడా టీం కప్పు గెలిచినప్పుడో...
ఎన్నికలలో అందరిఓట్లూ సాధించాల్సివచ్చినప్పుడో...
ఇలాంటప్పుడే ప్రత్యేక పాత్ర పోషిష్తుందది. ఆ నాటకం అయిపోగానే చెరిపేసే మేకప్ లా మళ్ళీ ఏ పాతపెట్టెలోనో దాచేస్తాం. బ్రతుకంతా భిన్నత్వాన్నే పట్టుకొని వ్రేలాడి, ఓడిపోతున్నప్పుడో పరిస్థితులు అనుకూలించనప్పుడో మరేదైనా లాభం వస్తుందనుకున్నప్పుడో "అందరం"అంటూ మన ప్రయోజనం కోసం ప్రయోగాలు చేస్తున్నాం.
దీనంతటికీ కారణం ఏమిటి? గుండెలమీద చెయ్యివేసుకొని ఆత్మని ప్రశ్నించుదాం రండి. మస్తిష్కం నుండి హృదయానికీ, హృదయం నుండి బుద్దికీ, బుద్దినుండి వాస్తవానికీ వచ్చి మన ప్రశ్నకి సమాధానం చూడండి...అక్కడ...కొన్నికోట్ల మంది సమూహం కనిపిస్తుంది.
ప్రజలు..
ప్రజలు..
ప్రజలు...
ఖచ్చితంగా వీటికి కారణం ప్రజలే. తెల్లవాని వ్యాపారం ఆర్ధికపరమైన దోపిడీకోసమే అయితే..., దేశవారసత్వపు సంపదలమైన మనం చేస్తున్న వ్యాపారం అన్నివిధాలా వ్యవస్థని మానభంగం చేయటంలేదూ? ఏం? అశోకుడూ
అక్బర్
మహాత్ముడూ
రాజ్యాంగం... ఎందరుచెప్పినా వినని ఈ ప్రజలు ఈనాటి ధారుణాలకి ఎవరిని నిందిస్తారు? రాజకీయాలనా సరే. ఎక్కడ నుంచి వచ్చాయవి? ఎవరివల్ల పాతుకుపోతున్నాయవి? సంధించండి మీ మనసాక్షిమీదకు ఈ శరాల్ని
అక్కడ మీకు మీరే కనిపిస్తారు...
రాజకీయవాదం ఏమన్నా దేశం కన్న కొత్తజాతా?... కాదే. మొదట దేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులే రాజకీయవేత్తలయ్యారు. రాజకీయాపు పరిధిని పెంచుకోవటం మొదలయ్యాక వారిలో రాజకీయమే సొంతవాదమై ఊడలువేయటం మొదలుపెట్టింది. ఆ మహావృక్షాన్ని మనిషి తాకకుండా వుండేందుకు దేశాన్నీ రాజ్యాంగాన్నీ వదిలేసి పార్టీ అనే నుసుగును కప్పుకోవటం ప్రారంభించిన వారికి... ఇక పార్టీ మనుగడే ప్రపంచం అయిపోయింది. ఆ పార్టిని నిలుపుకోవాలంటే పదవికావాలి, ప్రభుత్వం తమదవ్వాలి. వీటిని సాధించుకునే అధికారమే వారికున్న ఒకేఒక్క బ్రతుకుతెరువయ్యింది. అలా తాను దేశం కోసం కాక, దేశాన్ని తమకోసం వాడుకోవటం మొదలైంది. ఇదంతా జరగటానికి వారేమన్న తపస్సులు చేశారా? లేదే. అందుకు వారికున్న ఆయుధం ప్రజలే. ఆ ప్రజలు తమకోసం తాము తయారుచేసుకొని అమలుచేసుకుంటున్నామని నమ్ముకున్న రాజ్యాంగాన్ని అడ్డుగా వుంచుకొని ఎన్నికల క్రీడని మొదలుపెట్టారు.
ఆ ఎన్నికల క్రీడ ఎలా వుందో sep28thన చూద్దాం
శ్రీఅరుణం
మీ అభిప్రాయాలను పంపండి.
sssvas123in@rediffmail.com
no : 9885779207
facebook - sriarunam rao
నా కవితల కోసం sarithasrinivasam.blogspot.com చూడండి.

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.