Wednesday, August 28, 2013

మహాభారత ఉద్యమం పార్ట్2

 మద్యయుగంలో జాతీయసార్వభౌముడు అనిపించుకున్న అక్బర్ చక్రవర్తికీ అదే ఆలోచన. 
చక్రవర్తి ఆయినా మొదటినుండీ తను ఎవరో ఒకరి నీడనే బ్రతకాల్సివచ్చింది.కొన్నాళ్ళు భైరంఖాన్, మరికొన్నాళ్ళు సవతితల్లి.ఇప్పుడు ఆ పరదాలనుండి బయటకొచ్చితననితాను నిలుపుకోవాలన్న కాంక్షతో ప్రజలమద్యకు వెళ్ళాడు.కానీ అక్కడ తను ఊహించని అనేక వాస్తవాలు కళ్ళముందు కదిలాయి.తాను నమ్మిన సామ్రాజ్యవ్యవస్థ ఒక భౌతికరూపమే అని తెలుస్తుంది.వాస్తవంగా ప్రజలమద్యన అనేక పరదాలున్నాయి.
ముఖ్యంగా మతం అనే పరదా.
అది ఎంత బలంగా వుందో...అంత సున్నితంగానూ కనిపిస్తుంది.
ఒకరి మతం చెప్పేది మరొకరి మతంలో విరుద్ధం,
ఒకరి మతంలో చేయదగినది మరొకరికి అనైతికం
అన్నిటికంటే పెద్ద ప్రమాదమేమిటంటే, ఒకరికోసం ఏదైనా చేయటమంటే...మరొకరికి వ్యతిరేఖం అనే భావనని నరనరాలలోనూ ప్రజలు జీర్ణించుకున్నారు.అందువల్ల వీరికోసం పనిచేసినా ప్రమాదమే, చేయకపోయినా ప్రమాదమే అన్నట్లుంది తన పరిస్థితి.
చీకటీ వెలుగు, ఈ రెండు పార్శాలేగా వున్నాయి సృష్టికి. మరి మూడొదీ కావాలంటే ఏమివ్వాలి?నిజానికి ఇప్పుడు ప్రజలనుండి ఎదురౌతున్న సవాలిదే తనకి.అది చేయలేకపోయినా కనీసం వారి మద్యన శాంతికోసం తాను ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశాడు.   
1563లో తను మొదలుపెట్టిన రాజపుత్రవిధానం వెనుకనున్న ఆంతర్యం ఏమిటి?
కేవలం రాజ్యాన్ని విస్తరించుకోవటమే అయితే యుద్దాలుచేసి సాధించుకొనే బలం తనవద్దలేకనా? కాదే.చక్రవర్తి అనేస్థానాన్ని ప్రజల మనసులలో సంపాదించుకోవటానికి. బలంతోకాకుండా బంధంతో అందరిమద్యనా సమగ్రత సాధించాలనేకదా. అందుకే తను పరాయి మతంవారితోనూ వివాహసంబందాలను నెరిపాడు.అలా ఒక అత్యున్నతమైన లక్ష్యంతో మొదలుపెట్టినా, ఆ సంగమంలోని వాస్తవాన్ని లోతుగా అనుభవించాక తెలుస్తుంది...మతానికంటే అతీతమైనది మనసని. దాన్ని పరిపూర్ణంగా చూడగలిగిన క్షణాలు తనకేం తెలియచేశాయి???
మనిషి మనిషికీ మద్యనా
రాజ్యం రాజ్యానికీ మద్యనా
మతం మతానికీ మద్యనా...అసలు ఏమి జరుగుతుంది ప్రతీసారి.
భర్త అయినా,భార్యా అయినా తమ మద్యనున్న అనురాగానికి మతం ఏక్కడ కొలతలు చూపించగలిగింది? ఒక భర్తగా తనకెప్పుడూ..తెలీని తేడా, భార్యగా తనపై అనురాగం తప్ప మరోటి చూపని తన భార్య ప్రేమకు మతం ఎప్పుడైనా గుర్తొచ్చిందా? కానీ ఈ మనుషులెందుకు తమ బంధాన్ని విమర్శిస్తారు? ప్రత్యక్షంగా అనుభవించిన తానే తెలుసుకోలేని దోషాలు... అంతంతదూరంగా తమ ఆత్మలను బంధించుకుని బ్రతుకుతున్న వీరికేమి కనిపిస్తుంటాయి?  ఎప్పటికైనా ఇది మారుతుందా?అంటే తనకి తాను చెప్పుకొనే సమాధానం తప్ప మరోటి కనిపించటంలేదే...
హృదయానికంటే రక్తానికెందుకింత ఆభిజాత్యం?
మతానికి సంబంధించిన పన్నులను రద్దుచేసినా
ఇబదత్ ఖానాను[1575] నిర్మించినా
అమోఘత్వ ప్రకటను[1579] చేసినా
చివరకు ధీన్-ఇ-ఇల్లాహి[1582]ని ప్రచారం చేసినా
ఇవన్ని తను ఏదో ఒక మతంకోసం చేయలేదని ఎవరికీ అర్ధంకావటంలేదెందుకని?
ఇవన్నీ మనిషికోసం చేశాడు తను...
మనిషి తననుతాను నమ్ముకోవాలనుకున్నాడు...
అలా తనను నమ్ముకోవటం ఎప్పుడైతే మనిషి మొదలుపెడతాడో..అప్పుడే కదా మనుషులందరి మద్యన సామరస్యం నెలకొంటుంది.
కానీ, ఏ మాతానికామతం నివురుగప్పిన నిప్పులకుంపటిలా వుంటే దాని ముందు ఈ  మనుషులు తమ నమ్మకాలని కాచుకుంటున్నారు. అది వారి ఆశలను ఎలా సేదతీరుస్తుందో..అలాగే అవసరమనుకుంటే ఆ నిప్పునే కాగడాలుగా మారుస్తుందేమోకదా. కాలం ఎప్పుడూ మారుతూనేవుంటుంది. రేప్పొద్దున్న వచ్చే సామ్రాట్టులవల్లనో..., మరో ఉపద్రవం వల్లనో... వారిమద్యన ఏ చిన్న నిప్పుకణిక ఫేటేల్మని చిమ్మినా అదే లావాలా ప్రవహించకమారుతుందా? అదే తన భయం. అక్బర్ చక్రవర్తి గొప్పసామ్రాజ్యాన్ని సాధించాడు అనే పేరు కంటే, తనకున్న జాతీయ సార్వభౌముడన్న పేరుకు సార్ధకత సాధించాడన్న మాటే తన ఆత్మకు శాంతినిచ్చే మంత్రం. కానీ ప్రజల మనసులలో భిన్నత్వపు భావనేలేని ఏకత్వాన్ని సాధించగల శక్తిని వారి హృదయాలలో ఎప్పటికి సంపాదించుకుంటాడు?
ప్రాచీన కాలంలో తిరుగుబాట్లకు ప్రధానకారణాలు రాజ్యానివైతే, ఇప్పటి మద్యయుగానికి అవి మరింతగా పెరిగాయి
మనిషిపరంగా
మతపరంగా
అధికారపరంగా
సంధర్బానుసారంగా
ఇలా ఎన్నో విభిన్నతలు మనిషికీ మనిషికీ మద్యన దూరంపెంచుకోవటానికి కనిపెడుతూనేవున్నారు.
కానీ, కష్టపడి సాధించుకున్నవాడికి ఆ కష్టం నిష్ఫలమైపోతే...ఎంత రోదన మిగులుతుందో తనలాంటివారికే అనుభవమవుతుందేమో? తానేంతో కష్టపడితేకానీ సాద్యంకాని జాతీయత అనే పేరు కలకాలం నిలబడుంటుందన్న నమ్మకం చరిత్ర ఇవ్వటం లేదు.భవిష్యతు మన చేతుల్లో వుండదు.తను వుండగానే దీనిపై ఒక స్థిరత్వం సాదించగలడా?
ఎక్కడ శాశ్వతమైన శాంతిని నిలపగల ఒక దీపం లభిస్తుంది? 
ఎప్పటికి ఈ ప్రజలందలూ ఒకే కుటుంబమనే భావనను జీర్ణించుకుంటారు?
ఇది జరుగుతుందా...
జరిగే అవకాశం కలుగుతుందా..."
ఇలా సమగ్రతకోసం,ఏకత్వభావనకోసం పరితపించిన ఇద్దరు మహా చక్రవర్తుల ఆలోచన... కనీసం ఆధునికయుగంలో మనం ఎంతో పోరాటం సాగించి సాదించుకున్న స్వాతంత్ర్యమైనా మనకు అందించిందా?
దానికోసం మనం ఆధునికయుగంలోకి వద్దామా? వచ్చేవారం సెప్టెంబర్3న మళ్ళీ కలుద్దాం.
శ్రీఅరుణం



 

         
 

 


atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.