జీవితం సార్దకం చేసుకుందామన్న ఒక బుద్దిపూర్వక ఉద్దేశ్శంతో ఏ కవీ కవిత్వం రాయడు. జీవన తుఫానులలో కొట్టుకుపోతూ ఏ కొమ్మో ఆధారంగా దొరికినప్పుడు చేసుకొనే సమీక్ష కవిత్వం. అది అవిచ్చన్నంగా సాగే దీర్గకాలికప్రకియ కాదు.అప్పుడప్పుడూ చెప్పకుండా సంబవించే విద్య్హుత్ లాంటి సంఘటన-శేషేంద్రశర్మ గారు.
కవిత్వం అంటే కవితత్వం అనుకుంటాను నేను.అనుభూతులను ఆస్వాదిస్తున్న క్షణం వాటి విలువ అశాస్వతం. అదే క్షణంలో వాటికి అక్షరరూపం ఇచ్చి కాపాడుకొండి... ప్రతి నిముషమూ వాటి విలువ పెరిగిపోతూనే వుంతుంది.అటువంటి అనుభూతులను దాచుకోవాలన్న ఆశని నాలో రేకెత్తించినది ప్రేమ. అప్పుడే నిర్ణైంచుకున్నాను,ఇంత గొప్ప ఆనందాన్ని అదే సమయంలో అంతే వేదనని చూపిస్తున్న ప్రేమని ఇలా గాలికి వదలకూడదని.నాకు తెలిసిన నాలుగు అక్షరాలనీ కూర్చుకుంటూ కవితలు రాయటం మొదలు పెట్టాను.ఈ దారిలోనే
నా తొలి కవిత జన్మించింది ఇలా....
నా ప్రపంచం చాలా చిన్నది,అందుకే దానికి ఎక్కువ మాటలు రావు, రాయలని వున్నా..రూపం ఇచ్చేంత పదసంపద నా మస్తిస్కం కూర్చుకోలేదు,అంతలో నువ్వు కలిశావు.. అనుభుతుల నిఘంటువులా,ఆ క్షణమే నా పదలు మూటలు కట్టాఇ..చిన్న పాపాఇ మాటలుగా,నాకు ఫ్రాస రాదు నీపై ధ్యాస తప్ప.చంధస్సు చదవనేలేదు.. నీ చిరునవ్వు తప్ప.అలంకారలపై మనసు పోవటం లేదు.. అది నీ ఆహార్యం దగ్గరే నిలిచిపోఇంది ,అందుకే భావాలను బట్టిపట్టకుండాబదలాఇంచేస్తున్నాను..కాగితం పైకి.నీ ప్రేమలో మునిగితేలిన ఇప్పుడు.....నాకు అక్షరాలకు కొదవ లేదు,వాటికి నీ అనుభూతులతో చేరి రూపం దిద్దుకోవటం వచ్చేసింది.నువ్వూ నేనూ అనే పదాలు మన జీవననిఘంటువులో చెరిగిపోఇ,మనం అన్న పదం పుట్టిన ఈ క్షణమే...శ్రీఅరుణం అనే కలానికి జన్మనిచ్చింది.