Saturday, September 21, 2013

మహాభారత ఉధ్యమం Part 6


"డిస్కవరీ ఆఫ్ ఇండియా" నెహ్రూగారి ఈ పుస్తకం చదివినప్పటినుండీ నా మదిలో సుడులు తిరుగుతున్నవి రెండు విషయాలు.
ఒకటి భారతదేశం,
రెండు భిన్నత్వంలో ఏకత్వం.
ఇప్పటికీ ఆ మాటను మనం ఉపయోగించుకుంటున్నట్లుగా మరెవరూ ఉపయోగించుకోలేరేమో. నిజానికి రెండు చిన్నపదాల మద్యన వాక్యంపేరిట వేసిన అత్యున్నతబంధం అది. కానీ ఇప్పటికీ అవి మనకు వేర్వేరు పదాలుగానే కనిపిస్తున్నాయి. ఎప్పటికీ వాటిని వాక్యంగా మనం నమ్మమేమో అనిపించేలా దేశం నిత్యం ఉద్యమాలతో రగులుతూనే వుంది. అడపాదడపా ఏకత్వం అనేది ఎప్పుడైనా వినిపిస్తుందంటే...అది
విదేశీ దాడులప్పుడో..
దేశపు క్రీడా టీం కప్పు గెలిచినప్పుడో...
ఎన్నికలలో అందరిఓట్లూ సాధించాల్సివచ్చినప్పుడో...
ఇలాంటప్పుడే ప్రత్యేక పాత్ర పోషిష్తుందది. ఆ నాటకం అయిపోగానే చెరిపేసే మేకప్ లా మళ్ళీ ఏ పాతపెట్టెలోనో దాచేస్తాం. బ్రతుకంతా భిన్నత్వాన్నే పట్టుకొని వ్రేలాడి, ఓడిపోతున్నప్పుడో పరిస్థితులు అనుకూలించనప్పుడో మరేదైనా లాభం వస్తుందనుకున్నప్పుడో "అందరం"అంటూ మన ప్రయోజనం కోసం ప్రయోగాలు చేస్తున్నాం.
దీనంతటికీ కారణం ఏమిటి? గుండెలమీద చెయ్యివేసుకొని ఆత్మని ప్రశ్నించుదాం రండి. మస్తిష్కం నుండి హృదయానికీ, హృదయం నుండి బుద్దికీ, బుద్దినుండి వాస్తవానికీ వచ్చి మన ప్రశ్నకి సమాధానం చూడండి...అక్కడ...కొన్నికోట్ల మంది సమూహం కనిపిస్తుంది.
ప్రజలు..
ప్రజలు..
ప్రజలు...
ఖచ్చితంగా వీటికి కారణం ప్రజలే. తెల్లవాని వ్యాపారం ఆర్ధికపరమైన దోపిడీకోసమే అయితే..., దేశవారసత్వపు సంపదలమైన మనం చేస్తున్న వ్యాపారం అన్నివిధాలా వ్యవస్థని మానభంగం చేయటంలేదూ? ఏం? అశోకుడూ
అక్బర్
మహాత్ముడూ
రాజ్యాంగం... ఎందరుచెప్పినా వినని ఈ ప్రజలు ఈనాటి ధారుణాలకి ఎవరిని నిందిస్తారు? రాజకీయాలనా సరే. ఎక్కడ నుంచి వచ్చాయవి? ఎవరివల్ల పాతుకుపోతున్నాయవి? సంధించండి మీ మనసాక్షిమీదకు ఈ శరాల్ని
అక్కడ మీకు మీరే కనిపిస్తారు...
రాజకీయవాదం ఏమన్నా దేశం కన్న కొత్తజాతా?... కాదే. మొదట దేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులే రాజకీయవేత్తలయ్యారు. రాజకీయాపు పరిధిని పెంచుకోవటం మొదలయ్యాక వారిలో రాజకీయమే సొంతవాదమై ఊడలువేయటం మొదలుపెట్టింది. ఆ మహావృక్షాన్ని మనిషి తాకకుండా వుండేందుకు దేశాన్నీ రాజ్యాంగాన్నీ వదిలేసి పార్టీ అనే నుసుగును కప్పుకోవటం ప్రారంభించిన వారికి... ఇక పార్టీ మనుగడే ప్రపంచం అయిపోయింది. ఆ పార్టిని నిలుపుకోవాలంటే పదవికావాలి, ప్రభుత్వం తమదవ్వాలి. వీటిని సాధించుకునే అధికారమే వారికున్న ఒకేఒక్క బ్రతుకుతెరువయ్యింది. అలా తాను దేశం కోసం కాక, దేశాన్ని తమకోసం వాడుకోవటం మొదలైంది. ఇదంతా జరగటానికి వారేమన్న తపస్సులు చేశారా? లేదే. అందుకు వారికున్న ఆయుధం ప్రజలే. ఆ ప్రజలు తమకోసం తాము తయారుచేసుకొని అమలుచేసుకుంటున్నామని నమ్ముకున్న రాజ్యాంగాన్ని అడ్డుగా వుంచుకొని ఎన్నికల క్రీడని మొదలుపెట్టారు.
ఆ ఎన్నికల క్రీడ ఎలా వుందో sep28thన చూద్దాం
శ్రీఅరుణం
మీ అభిప్రాయాలను పంపండి.
sssvas123in@rediffmail.com
no : 9885779207
facebook - sriarunam rao
నా కవితల కోసం sarithasrinivasam.blogspot.com చూడండి.

Sunday, September 15, 2013

మహాభారత ఉధ్యమం Part5


స్వాతంత్ర్యవేడుకలు ముగిశాయి.  ప్రజలు తమ బ్రతుకుతెరువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు వారందరికీ ప్రాతినిద్యం వహిస్తున్న దేశం ముందు అతి పెద్దబాద్యత నిలబడివుంది. దేశ పరిపాలనకీ,వ్యవస్థని పునర్నిర్మించుకోవటానికీ కావలసిన ఒక స్పష్టమైన విధానాన్ని తయారుచేసుకోవాల్సిన కార్యక్రమం అది.
అది భారతరాజ్యాంగ నిర్మాణం.
ఆ దిశగా భారత రాజ్యాంగాన్ని తయారుచేసే ముసాయిదా నిర్మాణానికి డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో కమిటీ ఏర్పడింది.
అప్పుడే యం.ఎ.పస్ట్ క్లాస్  రిజల్ట్స్ తో ఇంటికొచ్చిన నాకు "రాజ్యాంగం అంటే ఏమిటన్నయ్యా?"అని అడుగుతూ నిలబడిన పక్కింటి తమ్ముడి ప్రశ్న చాలా బరువుగా తగిలింది. 385 ఆర్టికల్సూ కంఠత పట్టిన నాకు ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికి కొంత సమయం పట్టడానికి కారణం రెండు అంశాలు. ఒకటి రాజ్యాంగం గురించి వాడి స్థాయికి తగినట్లుగా చెప్పాలన్న ఆకాంక్ష. రెండు నేను చదివిన ఆ రాజ్యాంగానికీ...ప్రస్తుతం దేశం రాజ్యాంగాన్ని వుపయోగిస్తున్న తీరుకీ మద్యనున్న తేడా. సుధీర్ఘ, ధృఢ, అధృఢ, లిఖితపూర్వక వంటి అనేక లక్షణాల సమ్మిళితమైన దేశపు అత్యున్నత రూపాన్ని గురించి చిన్నమాటలో చెప్పి ఒక భావితరపు వారసుడిని పంపించాలని నాకనిపించలేదు. అలాగని వాడి స్థాయికి సరిపడేలా చెప్పటం కూడా నాకూ నాకు అంత తొరగా సాధ్యపడలేదు. ఇలా ఎందుకంటే ?భారత రాజ్యాంగం నాకిష్టమైన పుస్తకాలలో అత్యంత ప్రాణప్రదమైనది.రవిగాంచని చోటునూ కవి గాంచగలడన్నట్లు...తమ అపూర్వమైన వీక్షణశక్తితో విచక్షణమైన ఒక విధానాన్ని దేశానికి అందించడానికై "అన్నింటినీ"ఒక గ్రంధంగా కూర్చడమంత అద్భుతం వేరొకటి వుంటుందా?.అదే మన రాజ్యాంగం.
ఈ దేశం ఎలా ఏర్పడింది...?
ఎలా రూపుదిద్దుకుంది...?
గతమేంటి?
వర్తమానం ఎలా సాగాల్సివుంది?
భవిష్యత్తుకు ఏం అందించాలి?
వంటి అనేక విస్తారమైన విఙ్ఞానానికి ఒకే రూపం కలిగిస్తే అది మన రాజ్యాంగం.
రాజులు పోయారు. రాజ్యాలకు అవశేషాలుగా మిగిలిన సంస్థానాలూ కలిపేశాం. దేశంలో రాష్ట్రాలూ, ప్రాంతాలూ, కేంద్రపాలితాలూ అంటూ రకరకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
భౌగోళికంగా
వ్యవస్థాపరంగా
పాలనాపరంగా
ప్రాంతాలపరంగా
మతాలు కులాలపరంగా
జాతులపరంగా
ఇలా రకరకాల విషయాలపరంగా, విభిన్నతలకు పుట్టినిల్లు అనబడేలా ఉన్న దేశం మొత్తం "ఒకేచోట" తమనితాము నమ్ముకోగలిగేలా ఒక పుస్తకం రాయగలగాలంటే ఎంత అసాధ్యం...
లక్షలమందిని తన కరవాలానికి బలిచేసి, సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగిన అశోకసామ్రాట్ సాధించలేని సమగ్రతని...ఒక పుస్తకం ద్వారా సాధించాలి.
అఖండ భారతంలో మతలకు ఆలవాలమైన ప్రజలందరినుండీ జాతీయసార్వభౌముడనిపించుకోగలిగిన అక్బర్ చక్రవర్తికి సమాధానం దొరకని లౌకికత్వాన్ని...ఒక పుస్తకం సాధించాలి.
స్వచ్చమైన హృదయంతో కోట్లమందితో పూజలందుకున్న బాపూజీనే కలవరపరచిన ప్రజల మద్యనున్న మానసిక లోతులకు పరిష్కారం...ఒక పుస్తకం కనిపెట్టాలి.
ప్రాచీన,మద్య,ఆధునిక యుగాలలో ఒక భ్రమలా మిగిలిపోయిన భావాలన్నిటికీ అందమైన ఒకే భవనాన్ని ఒక పుస్తకం సాధించగలుగుతుందా?...అదే మొదట్లో నా అనుమానం. చరిత్ర విధ్యార్ధిగా భారత రాజ్యాంగానికి ముందున్న పరిస్థితులన్నీ చదివితెలుసుకున్న నాకు రాజ్యాంగపు రచనకు ముందున్న అవశ్యకాలేమిటో???తెలియటం వల్ల ఇదంతా మదిలో మెదులుతూ వుండేది.
అలాంటి అనేక సందేహాలకు సమాధానం గా మన రాజ్యాంగాన్ని చదువుతూవుంటే...దానిలోని
అత్యున్నతమైన మేధస్సు,
భవిష్యత్ వీక్షణ,
నిస్వార్ధపు ఆలోచనాశైలీ,
దేశ భక్తీ,
సమానత్వపు ధోరణీ ఇవన్నీ నాలోవున్న అనుమానాలను పటాపంచలుచేస్తూ...ఒక సంపూర్ణమైన భారతీయుడిగా నేను మారటానికి దోహదం చేశాయి. ఆ పుస్తకాన్ని చదవటం పూర్తిచేసిన క్షణం దానికి ఒక మనిషిగా సాష్టాంగ ప్రమాణం చేశాను భక్తితో.
కానీ,ఇప్పుడు సమకాలీన ప్రపంచపుదారులలో నడక సాగుతున్న నాకు...
నాదేశం అనుసరిస్తున్నదారి, ఆ రాజ్యాంగం చూపించిన దారికి ఎంతదూరంగా వుందో కొలవటానికే అంతు చిక్కని పరిస్థితి?...అసలు రాజ్యాంగం మనతో వుందా?అన్న ప్రశ్న...
ఒక ఆవేశం కానీ, సమస్యకానీ దేశం నుండి మొదలై...
రాష్ట్రం
ప్రాంతం
జిల్లా
నగరం
తాలూకా
గ్రామాం
వీధి
సందూ
చివరకు మనిషి స్థాయికి చేరిపోతున్నాయి. మనిషి మనిషినీ దూరం చేస్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాలక్రితమే ధర్మానికి వేధికగా నిలిచిన మహాభారత యుద్దాన్ని పురాణంగా గౌరవించుకుంటున్న ఈ భూమిపై నేటికీ అశాంతి తప్ప మరోటి మిగలని ఉద్యమాలు రగులుతూనేవున్నాయి. వీటికి ముగింపులేదా? రాజుల మార్పు, సామ్రాట్టుల చర్యలు, మహత్ముని శోకం, అత్యూన్నతమైన రాజ్యాంగం ఈ ప్రజల్లో శాశ్వతమైన మార్పుని ఎందుకు సాధించలేకపోతున్నాయి?
మార్పురాదా... వీరిలో?
లేక, తొలి నాగరికతలోవున్న జఢత్వమే వీరికి శాశ్వత శాపమా?
మారాలన్న కోరిక వీరిలో వస్తుందా?
మరి "భారత ప్రజలమైన మేము మాకోసం మేము తయారుచేసుకొని ఆమోదించుకుంటున్నామని" చెప్పిన మాటలు అబద్దాలుగా మిగిలిపోతున్నాయా?
ఇదంతా ప్రజల బాధ్యతేనా?
లేక, రాజ్యాంగం విఫలమైందా?
అదీకాక ప్రజనుండి తయారైన మరో శక్తి...ఇలా వ్యవస్థ తయారవటానికి కంకణం కట్టుకుందా? 
ఆ శక్తి గురించి వచ్చే వారం 22 సెప్టెంబర్ న చుద్దాం.
శ్రీఅరుణం.
మీ అభిప్రాయాలను పంపండి.
sssvas123in@rediffmail.com
no : 9885779207
facebook - sriarunam rao
నా కవితల కోసం  sarithasrinivasam.blogspot.com చూడండి.

Monday, September 9, 2013

మహాభారత ఉధ్యమం part4

అలా స్తబ్ధత ఆవరించిన ఆర్యవ్యవస్థలోని పాలకుల వలసవిధానలకు తలొగ్గి జీవించటం ప్రారంభించారు.
అశొకుడు వంటి చక్రవర్తుల కాలం నుండీ రాజు యొక్క మానసిక పరిస్థితికి తగినట్లుగా తమ బ్రతుకులను మార్చుకుని బ్రతకటం అవసరమైంది వారికి.
అలా అనేకమంది రాజుల అవకాశాలతో విసిగి వేసారిన వారి మనసులకు అక్బర్ వంటి జాతీయసార్వభౌముడి పాలనలో కొంత సేదతీరగలిగే అవకాశం ఏర్పడింది. కానీ,అదీ ఎన్నినాళ్ళో మిగలని పరిస్థితి మళ్ళీ ఔరంగజేబు ద్వారా సంక్రమించింది.
తమలోని ఏకత్వ భావనకు తూట్లు మొలిచిన ఆ కాలంలో  మనిషి మతం మార్చుకునో,కులాన్ని నమ్ముకునో, ప్రాంతాలను మార్చుకునో, చివరికి మనిషే మారిపోతూనో జీవితాల్ని నిలుపుకోవాల్సిన పరిస్థితి.ఇదంతా ఎందూకంటే? ముందు మనిషి బ్రతకాలికదా.అలా పొర్లుతూ వచ్చి బ్రిటీష్ వారి పాలనకొచ్చి పడ్డారు.
1922లో సహాయనిరాకరణ జరిపినప్పుడు పిలిస్తేకానీ ఉద్యమంలోకి రాని ప్రజలూ,
1930 శాసనోల్లంఘనానికి పిలవకున్నా ముందుకొచ్చారు,
అదే 1942నాటి క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకులమైన తామంతా జైళ్ళలో వున్నా వారే అత్యంత తీవ్రంగా ఉద్యమించి ప్రభుత్వాన్ని పెకళించగలిగేలా నిలిచారు.అలా పరాయివారి పాలన నుండి తమనితాము రక్షించుకోవాలన్న ఆశయం వారిలో మళ్ళీ ఒక గొప్ప ఏకత్వ భావనకు దారితీయగలిగింది.కానీ, మళ్ళీ ఇప్పుడు వందలసంవత్సరాలు పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించుకుంటున్నామనుకుంటున్న ఈ దశలో వీరికి మళ్ళీ ఆ పాత వాసనలు కావలసి వచ్చాయంటే కారణం ఎవరు???...
నిజానికి ప్రజలు అమాయకులు. తమకోసం తెలివితేటలను ఉపయోగించుకునే కొందరు, ప్రజలను ఇలాంటి దారులలోకి మళ్ళిస్తున్నారు. ఈ దేశప్రజలకు నిండుగా శక్తిసామర్ధ్యాలున్న, వాటిని నిరంతరమూ వినియోగించుకోగల అవకాశం వారికి ఈ నేల అందించలేదు. ఒక రాజుకాలంలో చేయతగినది మరో రాజు కాలంలో అనైతికం అయ్యే పరిస్థితి. ఇప్పుడా స్థానం మతం తీసుకుందేమో.అందువల్లనే ఆయా కాలాలకు తగినట్లుగా తమనితాము మలుచుకునే వెన్నపూసబొమ్మలయ్యారు ప్రజలు.ఒకరకంగా అది తమ తరం నాయకులకు గొప్పవరం.స్వాతంత్ర్యం సాధనతో నూతన భవిషత్తుని స్వేఛ్చగా నిర్మించుకోగల ఈ అవకాశం నిండుగా లభించిన తమకు ఇప్పుడే ప్రజల్ని పాతకాలపు నిస్తేజం నుండి బయటకు తీసుకురావాల్సివుంది. నడిపించగలిగే నాయకత్వం వుండాలేకానీ వారికోసం ఏదైనా చెయ్యగల చరిత్ర ఈ ప్రజలది.ఒక మాములుమనిషినయిన నన్నే మహత్ముడిగా నమ్ముకోగలిగారు వీళ్ళు.అలాంటివారి నడకలో తేడా వస్తుందంటే కారణం తామేకద.నాయకులమైనందుకు మరి మనమేం చేస్తున్నాం?
1919లో పరాయివాడి అసూయలోంచి పుట్టిన మత నియోజకవర్గాలన్ని చీలిక స్వభావానికి తలొగ్గాం. అదేకదా ఇప్పటి ఈ విభజనకి కారణం.ముక్కలుగా చేసిన ఈ గడ్డపై అటు ఇటూ రాలిపోతున్న ప్రాణాలెవరివి? మనవారివికదూ? వారికి జరిగిన మానసిక వ్యధకు చికిత్య చేయటం మాని, మావాళ్ళిందరూ...మీవాళ్ళిందరూ అని రక్తానికీ చీలిక లెక్కలను కడుతున్న మన నాయకత్వానికి ఏ పాపం అంటుకోనుంది?
మనం నాయకులమా? లేక...
మనపై పెట్టిన నమ్మకాల కాష్టాలను కాల్చుకుతుంటిన్న దోపిడిదారులమా?
కలిసుండాలనుకున్నా,విడిపోవాలనుకున్నా అది ప్రజల తప్పు కానేకాదు.నాయకులదే తప్పు. ఎందుకంటే 'మేము మీకంటే కాస్తంత తెలివైనవారిమని" చెప్పి మనం నాయకత్వం వహించి వారిని నడిపించాం.
నా చుట్టూ వున్న పిల్లలకు నేనోక ఆదర్శపాఠ్యాంశం కాగలనన్న నమ్మకంతోటే నేనూ ఈ స్వాతంత్ర్యపోరాటంలోకి రాగలిగాను. అలాంటి నేను ఈ దేశ స్వాతంత్ర్యంతో పాటు విభజననీ ఎలా అందించగలనూ. అందుకే మీరంతా స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకుంటుంటే,నాకు ఆనందం లేదు.అందరినీ ఏకతాటిపై నడిపి నేను సాధించాలనుకున్నది... చీలికద్వారా వచ్చిందన్న బాధే నాకు విలాపంగా మారింది. 
కుటుంబం
చదువు
ఉద్యోగం
ఆస్తి
చివరకు ప్రాణం కూడా దేశానికి ధారబోసి, తనపై భరోసాతో మరణించినవారి ఆత్మలకు నేనేమని సమాధానం చెప్పాలి?ఇది ఇలా వదిలేసివచ్చావే అని వారు రేపు నన్ను అడిగే ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు?స్వాతంత్ర్యం కోసం మనలో మనమే చీలికలు తెచ్చుకొనే కొత్త సంస్కృతికోసమా నువ్వు ఈ పోరాటం చేశావని అడిగేవారి ముందు నా ఆహింసా, సత్యాగ్రహం ఏమని బదులిస్తాయి.
"హే భగవాన్.నా ప్రజలకి ఒక మంచి దారినివ్వు.మళ్ళీ అదికారం ఆడించే బొమ్మలుగా వారిని మార్చకు.దేశానికి లభించిన స్వాతంత్ర్యమే ఇంత పెద్ద విభజనకు దారి తెలిస్తే , ఇక అంతర్గత స్వాతంత్ర్యం లభించే స్వాతంత్ర్యం ఏం చేయబోతుంది"అంటూ ఘోషిస్తున్న గాంధీజీ ఆత్మ సాక్షిగా మన పెద్దలు దేశాన్ని నడిపించటానికి మన రాజ్యాంగాన్ని తయారు చేయటం ప్రారంభించారు.
అత్యున్నతమైన ఆ రాజ్యాంగం మనకు ఏం చెప్పింది...మనం దానిని ఎలా నమ్ముకున్నామన్నదీ తరువాత వార [sep17] నుండి చూద్దాం... 
శ్రీఅరుణం

Tuesday, September 3, 2013

మహాభారత ఉధ్యమం part3

1947ఆగస్ట్15.
ఈ రోజుకు ఏ భారతీయుడికీ ఉపోధ్ఘాతం చెప్పనవసరం లేదు.ఎన్నో సంవత్సరాల పోరాటఫలితంగా మన స్వాతంత్ర్యం సాకారమైన రోజది. ఆ రోజున అందరి గుండెలలోనూ భారతమాత నిండిపోయింది. ఆమెతోపాటూ వారిని అపాదమస్తకమూ కదిలించేలా చేసిన ప్రశ్న ఒకటుంది  అది"మహాత్ముడెక్కడా?"అని.....
నిజం ఎప్పుడూ నిలకడగానే వుంటుంది.సర్దుబాట్లూ,సందర్భాలూ,అవకాశాలు,అవసరాలు దానినెప్పుడూ ప్రభావితం చెయ్యలేవు. అలా చేసేవయితే అది నిజమే కాదు. నిజం అని మనం నమ్మించుకున్న ఒక నీడ.
మహాత్ముడూ అంతే. ప్రజలకోసం ఆయన చేసిన త్యాగం ఈ రోజున రెండుగా చీలిపోయిన దేశంగా తనముందుంది. ఆ చీలిక అంచులలో కూర్చుని ఆయన తన శాంతి ధీక్షను పాటిస్తున్నారు. రెండుగా చీలిన తన ప్రజలను చూస్తూ కన్నీరు కారుస్తున్న ఆ హృదయానికి స్వాతంత్ర్యం ఎలా ఆనందాన్ని మిగులుస్తుంది పాపం.
అతి విలువైన జీవితాన్నే అర్పించుకున్న ఆ శాంతిదూతకు ఈ దేశం అందించిన బహుమతి అదే.
ఆ విచారం ఆయనలో నిరంతరాయమైన ఆలోచనల్ని రగిలించింది. ఎందుకు తానీ పోరాటం చేశాడు? ప్రజలకోసమేగా. మరి వీరిమద్యలోనే ఇన్ని ఆవేశాలుంటే..., ప్రారంభంలోనే ఇంతగా సెగలుకక్కుతుంటే... రేపు వీరికి ఏ భవిష్యత్ అందుతుంది? 
ఒకప్పుడనుకునేవాడు"ఎందరో గొప్ప చక్రవర్తులేలిన ఈ భూమిపై ప్రజలందరిమద్యనా ఏకత్వం ఎందుకు సాధించలేకపోయారని. ఆ ప్రయత్నాలు చేసిన వారూ వున్నారు. అందులో అశోకుడూ, అక్బర్ వంటివారు మరింతగా తపించారు. కానీ ఫలితం ఎందుకు రాలేదు?అంటే...వారిద్దరూ... అధికారం కోసం, దానిని సద్వినియోగం చేసుకోవటం కోసం సమగ్రతని కోరుకొని వుండవచ్చు. కానీ తాను ఏం కోరుకుని ఈ ప్రజలకోసం పోరాటం చేశాడు? చివరికి స్వాతంత్రదేశంగా మారినతరువాత కూడ తనకి ఈ దేశంపై విడిపోయిందన్న బాదే తప్ప మరో ఆనందం మిగిలిందా? తన పోరాటానికి గౌరవంగా మహాత్ముడన్న బిరుదునిచ్చి పక్కకు తోసేశారు. వారు మాత్రం
మతం ఆధారంగానో,
కులాల ఆధారంగానో,
ప్రాంతాల ఆధారంగానో ఎవరికివారు వేరవటానికి సిద్ధమైపోతున్నారు. పైగా వాటికి మానవహక్కులూ,భిన్నత్వాలను గౌరవించటం అని రకరకాలుగా పేర్లు పెడుతూ ఊగిపోతున్నారు. దేశం కోసం ఎంతో త్యాగం చేసిన మహాత్ముడు తన కోసం ఏ పదవీ అడగలేదని అంటున్నారేకానీ... మనుషులందరూ ఒకటే అంటూ నిరంతరం తన మనసు ఘోషిస్తున్న "రఘుపతిరాఘవరాజారాం..." ఆన్న అంతరంగాన్ని కేవలం రికార్డులకెక్కించి, తాము మాత్రం తన్నుకుంటున్నారు. నిజంగా అది వీరికి వినపడకా? లేక వినపడినా వారి మానసిక స్థితి అదేనా? అదే అయితే తాను చేసిన ఈ పోరాటమంతా నిష్ఫలమేగా. అవును తాను కేవలం ఒక జాతికోసమో, ఒక మతం కోసమో,ఒక ప్రాంతం కోసమో పోరాడలేదు. అహింసా,సత్యాగ్రహం వంటి పవిత్రమైన విధానాలను కేవలం ఒక దేశ స్వాతంత్ర్యం కోసం ఉపయోగించాలనుకోలేదు,అలా అనుకోవటమే వాటి విలువను తెలుసుకోకపోవటం.
తన పోరాటం మనిషి స్వాతంత్ర్యం కోసం.
అందుకే పరాయివాడినైనా అహింసయుతంగానే గౌరవించాలన్నాడు. ఆ అహింసలో ప్రేమ వుంది. సాటిమనిషినీ తనలాంటి మనిషిగా గుర్తించగలిగే వ్యవస్థకు అదే మార్గం. మనిషిని ప్రేమించగలిగినప్పుడు ప్రపంచంలో మనకు భిన్నత్వం ఎలా కనిపిస్తుంది? అదే తాను దక్షిణాఫ్రికాలోనూ అనుసరించాడు, ఇక్కడా అనుసరించాడు.  ఇన్ని సంవత్సరాల నా పోరాటాన్ని నమ్మి ప్రజలంతా తనని అనుసరిస్తుంటే...అహింస అనే మార్గం ద్వారా విశ్వశాంతికై సిద్ధమౌతున్న చుక్కానీలనుకున్నాడు.కానీ...
ఇప్పుడిక్కడ జరుగుతున్నదేంటి? తను ప్రతీ క్షణం నడయాడిన ఈ గడ్డ రెండు దేశాలుగా చీలిపోతుంది.స్వాతంత్ర్యం కోసం ప్రతీ క్షణం వెచ్చించిన రక్తాన్నీ శాoతిధామం చేసి, కలిసిసాధించుకున్న గుండె... మతంకోసం విడిపోతానంటుంది.
అసలు ఈ మార్పు ఎలా వచ్చింది?
మనిషికోసం నేను చేసిన ఈ సుధీర్ఘమైన పోరాటంలో ఎవరి సొంత ప్రయోజనాలు ఈ చీలికని తెచ్చాయి?
ఎవరి స్వార్ధం దీని ఆజ్యం పోసింది?
ఎవరిని ఆక్రోశం ఈ పరిస్థితికి దారులు వేసింది?
వీటికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది???
అసలు తప్పెవరిది?
నాయకులమైన తమదా?
ప్రజలదా?...
నిజానికి ఈ దేశప్రజలు గొప్ప సహనవంతులు. దానిని పిరికితనమనీ, అతిగా పాటించే శాంతిమంత్రానికి వారసులనీ  కొద్దిమంది అన్నంతమాత్రాన్న అది ఎప్పటికీ నిజం కాలేదు. తమ మొదటి నాగరికతనుండి, ప్రతీసారీ వారిమీద ఏదో ఒక నూతన వ్యవస్థ, విధానమో, మతమో, అదికారమో వారిపై స్వారీ చేయటం నేర్చుకున్నాయి.అయినా వాటికి తగినట్లుగా తమ నడకను మార్చుకున్నారే కానీ , ఎన్నడూ దేశాన్ని వదిలించుకోవాలని వారు అనుకోలేదు. అలా అనుకొనివుంటే...ఈ పాటికే దేశం ఖాళీ అయిపోయివుండేదేమో.
తమ మొదటినాగరికత అయిన సింధూలోనే అత్యున్నతమైన పట్టణ నాగరికతకు ఆలవాలమైన దేశం, ఆర్య సంస్కృతి వచ్చేసరికి మళ్ళి ఎలా వెనక్కెళ్ళిపోయారు!!!
తరువాత వారంseptember 10  చూద్దాం...
శ్రీఅరుణం

Wednesday, August 28, 2013

మహాభారత ఉద్యమం పార్ట్2

 మద్యయుగంలో జాతీయసార్వభౌముడు అనిపించుకున్న అక్బర్ చక్రవర్తికీ అదే ఆలోచన. 
చక్రవర్తి ఆయినా మొదటినుండీ తను ఎవరో ఒకరి నీడనే బ్రతకాల్సివచ్చింది.కొన్నాళ్ళు భైరంఖాన్, మరికొన్నాళ్ళు సవతితల్లి.ఇప్పుడు ఆ పరదాలనుండి బయటకొచ్చితననితాను నిలుపుకోవాలన్న కాంక్షతో ప్రజలమద్యకు వెళ్ళాడు.కానీ అక్కడ తను ఊహించని అనేక వాస్తవాలు కళ్ళముందు కదిలాయి.తాను నమ్మిన సామ్రాజ్యవ్యవస్థ ఒక భౌతికరూపమే అని తెలుస్తుంది.వాస్తవంగా ప్రజలమద్యన అనేక పరదాలున్నాయి.
ముఖ్యంగా మతం అనే పరదా.
అది ఎంత బలంగా వుందో...అంత సున్నితంగానూ కనిపిస్తుంది.
ఒకరి మతం చెప్పేది మరొకరి మతంలో విరుద్ధం,
ఒకరి మతంలో చేయదగినది మరొకరికి అనైతికం
అన్నిటికంటే పెద్ద ప్రమాదమేమిటంటే, ఒకరికోసం ఏదైనా చేయటమంటే...మరొకరికి వ్యతిరేఖం అనే భావనని నరనరాలలోనూ ప్రజలు జీర్ణించుకున్నారు.అందువల్ల వీరికోసం పనిచేసినా ప్రమాదమే, చేయకపోయినా ప్రమాదమే అన్నట్లుంది తన పరిస్థితి.
చీకటీ వెలుగు, ఈ రెండు పార్శాలేగా వున్నాయి సృష్టికి. మరి మూడొదీ కావాలంటే ఏమివ్వాలి?నిజానికి ఇప్పుడు ప్రజలనుండి ఎదురౌతున్న సవాలిదే తనకి.అది చేయలేకపోయినా కనీసం వారి మద్యన శాంతికోసం తాను ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశాడు.   
1563లో తను మొదలుపెట్టిన రాజపుత్రవిధానం వెనుకనున్న ఆంతర్యం ఏమిటి?
కేవలం రాజ్యాన్ని విస్తరించుకోవటమే అయితే యుద్దాలుచేసి సాధించుకొనే బలం తనవద్దలేకనా? కాదే.చక్రవర్తి అనేస్థానాన్ని ప్రజల మనసులలో సంపాదించుకోవటానికి. బలంతోకాకుండా బంధంతో అందరిమద్యనా సమగ్రత సాధించాలనేకదా. అందుకే తను పరాయి మతంవారితోనూ వివాహసంబందాలను నెరిపాడు.అలా ఒక అత్యున్నతమైన లక్ష్యంతో మొదలుపెట్టినా, ఆ సంగమంలోని వాస్తవాన్ని లోతుగా అనుభవించాక తెలుస్తుంది...మతానికంటే అతీతమైనది మనసని. దాన్ని పరిపూర్ణంగా చూడగలిగిన క్షణాలు తనకేం తెలియచేశాయి???
మనిషి మనిషికీ మద్యనా
రాజ్యం రాజ్యానికీ మద్యనా
మతం మతానికీ మద్యనా...అసలు ఏమి జరుగుతుంది ప్రతీసారి.
భర్త అయినా,భార్యా అయినా తమ మద్యనున్న అనురాగానికి మతం ఏక్కడ కొలతలు చూపించగలిగింది? ఒక భర్తగా తనకెప్పుడూ..తెలీని తేడా, భార్యగా తనపై అనురాగం తప్ప మరోటి చూపని తన భార్య ప్రేమకు మతం ఎప్పుడైనా గుర్తొచ్చిందా? కానీ ఈ మనుషులెందుకు తమ బంధాన్ని విమర్శిస్తారు? ప్రత్యక్షంగా అనుభవించిన తానే తెలుసుకోలేని దోషాలు... అంతంతదూరంగా తమ ఆత్మలను బంధించుకుని బ్రతుకుతున్న వీరికేమి కనిపిస్తుంటాయి?  ఎప్పటికైనా ఇది మారుతుందా?అంటే తనకి తాను చెప్పుకొనే సమాధానం తప్ప మరోటి కనిపించటంలేదే...
హృదయానికంటే రక్తానికెందుకింత ఆభిజాత్యం?
మతానికి సంబంధించిన పన్నులను రద్దుచేసినా
ఇబదత్ ఖానాను[1575] నిర్మించినా
అమోఘత్వ ప్రకటను[1579] చేసినా
చివరకు ధీన్-ఇ-ఇల్లాహి[1582]ని ప్రచారం చేసినా
ఇవన్ని తను ఏదో ఒక మతంకోసం చేయలేదని ఎవరికీ అర్ధంకావటంలేదెందుకని?
ఇవన్నీ మనిషికోసం చేశాడు తను...
మనిషి తననుతాను నమ్ముకోవాలనుకున్నాడు...
అలా తనను నమ్ముకోవటం ఎప్పుడైతే మనిషి మొదలుపెడతాడో..అప్పుడే కదా మనుషులందరి మద్యన సామరస్యం నెలకొంటుంది.
కానీ, ఏ మాతానికామతం నివురుగప్పిన నిప్పులకుంపటిలా వుంటే దాని ముందు ఈ  మనుషులు తమ నమ్మకాలని కాచుకుంటున్నారు. అది వారి ఆశలను ఎలా సేదతీరుస్తుందో..అలాగే అవసరమనుకుంటే ఆ నిప్పునే కాగడాలుగా మారుస్తుందేమోకదా. కాలం ఎప్పుడూ మారుతూనేవుంటుంది. రేప్పొద్దున్న వచ్చే సామ్రాట్టులవల్లనో..., మరో ఉపద్రవం వల్లనో... వారిమద్యన ఏ చిన్న నిప్పుకణిక ఫేటేల్మని చిమ్మినా అదే లావాలా ప్రవహించకమారుతుందా? అదే తన భయం. అక్బర్ చక్రవర్తి గొప్పసామ్రాజ్యాన్ని సాధించాడు అనే పేరు కంటే, తనకున్న జాతీయ సార్వభౌముడన్న పేరుకు సార్ధకత సాధించాడన్న మాటే తన ఆత్మకు శాంతినిచ్చే మంత్రం. కానీ ప్రజల మనసులలో భిన్నత్వపు భావనేలేని ఏకత్వాన్ని సాధించగల శక్తిని వారి హృదయాలలో ఎప్పటికి సంపాదించుకుంటాడు?
ప్రాచీన కాలంలో తిరుగుబాట్లకు ప్రధానకారణాలు రాజ్యానివైతే, ఇప్పటి మద్యయుగానికి అవి మరింతగా పెరిగాయి
మనిషిపరంగా
మతపరంగా
అధికారపరంగా
సంధర్బానుసారంగా
ఇలా ఎన్నో విభిన్నతలు మనిషికీ మనిషికీ మద్యన దూరంపెంచుకోవటానికి కనిపెడుతూనేవున్నారు.
కానీ, కష్టపడి సాధించుకున్నవాడికి ఆ కష్టం నిష్ఫలమైపోతే...ఎంత రోదన మిగులుతుందో తనలాంటివారికే అనుభవమవుతుందేమో? తానేంతో కష్టపడితేకానీ సాద్యంకాని జాతీయత అనే పేరు కలకాలం నిలబడుంటుందన్న నమ్మకం చరిత్ర ఇవ్వటం లేదు.భవిష్యతు మన చేతుల్లో వుండదు.తను వుండగానే దీనిపై ఒక స్థిరత్వం సాదించగలడా?
ఎక్కడ శాశ్వతమైన శాంతిని నిలపగల ఒక దీపం లభిస్తుంది? 
ఎప్పటికి ఈ ప్రజలందలూ ఒకే కుటుంబమనే భావనను జీర్ణించుకుంటారు?
ఇది జరుగుతుందా...
జరిగే అవకాశం కలుగుతుందా..."
ఇలా సమగ్రతకోసం,ఏకత్వభావనకోసం పరితపించిన ఇద్దరు మహా చక్రవర్తుల ఆలోచన... కనీసం ఆధునికయుగంలో మనం ఎంతో పోరాటం సాగించి సాదించుకున్న స్వాతంత్ర్యమైనా మనకు అందించిందా?
దానికోసం మనం ఆధునికయుగంలోకి వద్దామా? వచ్చేవారం సెప్టెంబర్3న మళ్ళీ కలుద్దాం.
శ్రీఅరుణం



 

         
 

 


Thursday, August 22, 2013

మహాభారత ఉధ్యమం పార్ట్ 1

క్రీ.పూ.261.కళింగ యుద్దం ముగిసినరోజులు.అప్రతిహాతమైన విజయం దక్కించుకున్న అశోకచక్రవర్తి నివాసముంటున్న రాజగృహ సముదాయమది.అపూర్వమైన ఆ విజయంతో నిజానికి శోభాయమానంగా వెలుగులుచిమ్మాల్సిన ఆ రాజభవనంలో అటువంటి చాయలేవీ కనపడుటలేదు.ఎక్కడ చూసినా ఏదో నిరాశ, ఎవరిమోములోనైనా మరేదో నిర్వేదం గోచరిస్తున్నాయి. అన్నిటికీ మూలమైన అశోకుని మందిరంలో పరిస్థితి మరింత ధారుణంగా వుంది.విజయానికి చిహ్నమైన ఆ చోటు అందుకు విభిన్నమైన అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది? ఆయన శయనమందిరం నిశ్శబ్దంతో నిండిపోయివుంది.ఆ నిశ్శబ్దపు సంధిగ్దం లోంచి పుడుతున్న గాలితెరలు ప్రశ్నలుగా సంచరిస్తున్నాయి.
ఆ ప్రశ్నలలో ఎన్నో వాస్తవాలు, గతకాలపు అనుభవాలు, భవిష్యత్తుని నమ్ముకున్న ఊహలు...ఇవన్నీ కలగలసి ఆయనని ఉక్కిరిబిక్కిచేస్తున్నాయి.వీటన్నిటినీ భేదించాలని చూస్తున్న అతని మస్తిష్కం ఏ క్షణాన్న ఎలా విస్ఫోటనం చెందబోతుందో? అని అందరూ భీతావాహులై ఎదురుచూస్తున్నారు. వారికప్పటికి తెలిసిన అశోకుడు చండాశోకుడే.
కానీ అతనిలోనే ఇప్పుడు మరో మనిషి వున్నాడన్న సత్యం గోచరమవుతుంది.అదే  ఇప్పుడు ఆయనలో జరుగుతున్నది మానసిక ఘర్షణ.  ఈ ఘర్షణ, ఆవేశం ఏవరిమీదోకాదు  తనమీద తనకే. అందుకే ఆయన నిశ్శబ్దాన్ని తోడుతీసుకున్నాడు. ఆ తోడే ఆయనకి అనేక నిజాలను హృదయం ముందు పరుస్తున్నది. వాటిని మొదటిసారిగా ఒక రాజుగాకాక, ఒక మనిషిగా చదువుకోవటం ప్రారంభించాడు.
   తండ్రి బింధుసారుడు చనిపోయిన తరువాత రాజ్యాధికారం కొరకు జరిగిన వారసత్వయుద్దంలో బంధం, బంధుత్వం, జాలీ, వివేచనా అనేవి లేకుండా రాజధర్మం అనే ద్వజాన్ని తన మనసుల్లోకి పాతుకున్నాడు. తద్వారా లభించిన బలంతో రాజ్యానీ, ప్ర జలనీ అణగదొక్కి పాలించాలనుకున్నాడు. అందుకోసం నిరంతరమూ శ్రమించాడు కూడా. దానికి ఫలితంగా తనకు లభించిన చండాశోకుడన్న పేరు చూసి గర్వించేవాడు. అప్పుడు తను నమ్మినది రాజే ప్రజలు అని. తన మనస్సు ఎక్కడ ఆనందాన్ని పొందుతుందో అదే తను నిర్వర్తించాల్సిన ధర్మం అని నమ్మాడప్పుడు.
   మరి? ఇప్పుడు...తను ఎంతో గొప్పదని నమ్మిన కళింగయుద్దవిజయం తనకెందుకు శాంతినివ్వటంలేదు?  
ఒక రాజుగా, అంతకు మించి సామ్రాట్టుగా తన ధర్మమేగా తాను సాధించాడు?
యుద్దంలో శత్రువుని వధించకుంటే వాడు తనని వదులుతాడా?
అయినా... తెగిపడుతున్న ప్రతి శిరస్సూ తన అంతరాత్మతో ఏం మాట్లాడుతుంది?
అసలు ఈ యుద్దాలు తానెందుకు చేస్తున్నాడు?
యువరాజుగా వున్నప్పుడు... తక్షశిలలో ప్రజల తిరుగుబాటుని అణచివేసినప్పుడు అసలు తాను ఏం ఆలోచించాడు? తనకున్న అదికారబలంతో వారిని అణగదొక్కాననుకున్నడనుకున్నాడే కానీ, తాను గర్వంతో వేసిన అడుగుల పక్కన నోళ్ళుకుక్కుకున్న ప్రజల వేదనలని విన్నాడా?లేదు. అదే ఇప్పుడు తనలో తిరగబడుతుందా?...
పోనీ తరువాత రాజుగా అధికారాన్ని సాధించుకున్నాకైనా సాటి మనిషి కోరుకుంటున్న ఆశలని పరిశీలించగలిగాడా అంటే? అదీ లేదు. ఎంతసేపూ ప్రజలనందరినీ తనకు విధేయులుగా నియంత్రిచాలన్న సూత్రమే తప్పించి, వారు కోరుకుంటూన్న వాటిని నిజాయితిగా తీర్చటంద్వారా వారి హృదయాలను గెలుచుకొనే ప్రయత్నమూ చెయ్యలేదు. పాపం వారెంతగా తనని ఈసడించుకున్నారో దానికి ప్రతిరూపమే ఆ చండాశోకుడన్న పేరని ఇప్పుడు అర్ధమవుతుంది.
సరే ఇక కళింగ. "ఈ విజయం ద్వారా మన రాజ్యం మరింతగా విస్తరింపచేశానని" గట్టిగా అరిచి తన ప్రజలకు చెబుదామంటే, యుద్దంలో తెగిపడిన రక్తపు ముద్దలు తమలాంటి మనుషులవేనని వారు తనతో చెబుతున్నట్లు గొంతుకు అడ్డుపడుతున్నాయి. ఇదంతా తనలో మానసిక విధ్వంసానికి దారితీస్తుందిప్పుడు. అయినా తన నమ్మకాలతో తనని అనుసరించినవారూ వున్నారు కదా? వారికి రాని ఆలోచనలు తనకెందుకు వస్తున్నాఇప్పుడు?
    వారు తమ ధర్మాన్ని కాకుండా  రాజుధర్మాన్నే పాటించారా? అయివుండొచ్చు. అలాంటి ప్రజలకోసం రాజుగా తను ఏం చేయాలిప్పుడు?
 ప్రజలు తాము ఏర్పడిన సమూహాలకి భధ్రతగా రాజ్యాన్ని నిర్మించుకున్నారు.ఆ రాజ్యాన్ని కాపాడుకోవటానికి రాజుల్ని తయారుచేశారు. ఆ రాజు ధర్మం వారిని ఆ సమాజంలో భధ్రంగా కాపాడటమే అయినప్పుడు...తను మాత్రం చేసిందేమిటి? చిన్నచిన్న రాజ్యాల మధ్యన తిరుగుబాట్లను అణచివేసి వాటన్నిటినీ కలిపి మహా సామ్రాజ్యంగా మలచాడు. ఆ దారిలోనేగా ఈ రక్తపాతం జరిగింది. ఒక పెద్ద లక్ష్యం కోసం చిన్నచిన్న సమస్యలని పట్టించుకోవాలా? అది ప్రజలకు తెలీదా? 
సొంతప్రజల మధ్యన సమైక్యతకోసం తిరుగుబాట్లను అణచినా తనకి చెడ్డపేరు తప్పలేదు. 
బయటప్రజలపై గెలిచినా చెడ్డపేరు తప్పట్లేదు.
ఏమిటీ ప్రపంచం?
అసలు ప్రజలంతా కోరుకునంటున్నదేమిటి?
రాజుగా తను ఎక్కడ తప్పుచేశాడు?
రాజ్యం నిజమా?
రావణకాష్టం నిజమా?
నమ్మకం నిజమా?
నమ్మటం నిజమా?
చక్రవర్తిగా తను నిలవటం నిజమా?
మనిషిగా తనను తాను నిలబెట్టుకోవటం నిజమా?
ఏది ఈ ప్రపంచాన్ని ఏకత్వంగా నిలిపివుంచగలుగుతుంది?
బలమా? విధ్వంసమా? పదవా? అధికారమా?....
వీటిల్లో ఏ ఒక్కటి నిజమైనా తాను యువరాజుగా వున్నపుడూ, మహారాజుగా మారినప్పుడూ, సామ్రాట్టుగా రూపొందినప్పుడూ ఎప్పుడూ ఇదే సమస్య ఎలా తలెత్తుతుంది? 
అసలు శాశ్వతమైన సామరస్యం నిరంతరమూ ఈ మనుషుల మధ్యన వుండకపోవటానికి కారణం ఎవరు?
1.ఏకత్వసాధనను కేంద్రీకరించాలనుకోవటమా?
2.రాష్ట్రాలు,ఆహారాలు,ప్రాంతాలు అని పాలనాసౌలభ్యం కొరకు విభజించిన ఫలితమా?
3.మానవ ప్రవృత్తిలోనే వున్న వ్యక్తిత్వపు నిరంకుశమా? 
ఏది ఈ విశ్వానికి శాంతి నిస్తుంది?.....
అర్ధశాస్త్రంలో వున్నట్లు ఎవరికివారు తమ పదవికున్న ధర్మాన్ని పాటించుకుంటూ పోవటమేనా జీవితసాఫల్యం. అలాగైతే, ఈ భిన్నత్వాలు ఎప్పటికీ సమసిపోవుగా. మనిషి మనిషికీ మధ్యన ఎడారి పెరిగిపోతుంది కదా. ఒకరి శాంతి మరొకరి అశాంతిగా మారని విశ్వమానవ కళ్యాణానికై ఏం చేస్తే బాగుంటుందో...అది చేయటానికి సంకల్పిస్తేనే తనలోని ఈ మానసికవేధనకి నిజమైన ప్రశాంతత కలుగుతుందేమో...
ఇలా....
 ఆయన పడిన వేధనకి సమాధానంగా బౌద్ధాన్ని అనుసరించారేమో కానీ, అది సమస్యకి పరిష్కరం మాత్రం కాలేకపోయింది.ఎందుకంటే ఆయనలోని ప్రశ్నలు మానవులందరికోసం అయినా తను చెప్పుకున్న సమాధానం మాత్రం తానొక్కడికోసమే. అంతటితో అశోకుని చిత్తం శాంతించేమోకానీ, ఈనాటికీ మనిషి మనిషికీ మధ్యన వైషమ్యాల చిచ్చు అలా రగులుతూనేవుంది. ఎలాంటి విభిన్నతల ప్రపంచం కక్కుతున్న ఉధ్యమాలకు ఏది పరిష్కారం? ఎప్పటికి ముగింపు?...
ఈ ప్రాచీనభారత యుగపు  ఆలోచనేమధ్యయుగానికి పయనించి అక్బర్ సామ్రాట్ మదిలో గూడుకట్టుకుంది. ఏదో ఒక సంధర్భంలో ఆ గూడులోంచి ఆలోచనలు భళ్ళున ఆయనను చుట్టుముట్టాయి
ఎందూకూ?
ఎలా? అంటే మరోసారి...వాటిని వచ్చేవారం ఇదేరొజు[28ఆగస్ట్]న ఇక్కడే చదువుదాం.   









Monday, August 19, 2013

మహాభారత ఉధ్యమం

మీరు చదువుతున్నది కరెక్టే. నేను రాయబోతున్నది మహాభారతంలో జరుగుతున్న  ఉద్యమం గురించే. అందుకే ఆ పేరు పెట్టాను.
ఒక రాజ్యం వుండేది.దాన్ని ఇద్దరు అన్నదమ్ములు తమకున్న శక్తియుక్తులతో నిర్మించుకొని అభివృద్ధి చేసుకున్నారు. వారిద్దరికీ ఒకే ఆశయం వుంది కనుక మరో ఆలోచనలేదు.కానీ కాలక్రమంలో జరిగిన మార్పుల దృష్ట్యా వారి కుమారుల మధ్యన సొంత ఆలోచనలు మొదలైయ్యాయి. అవి  రాజ్యం విషయంలో భాగాలుగా మారి, పంపకాల కొరకు వాదనలు మొదలైయ్యాయి.  ఆ వాదన యుద్దానికి దారితీసింది.అందులో విజయం ఆధారంగా సమస్యకు పరిష్కారం లభించింది, స్థూలంగా ఇదీ కధ అంటూ ముగిస్తే ఎవరైనా సులువుగానే సమాధానం చెప్పేస్తారు "మాహాభారతం" అని.
మరి, ఆ మాత్రం కధ ఒక అత్యున్నతమైన గ్రంధరాజంగా ఎలా మారింది?
గొప్ప పురాణంగా...
పద్దేనిమిది పర్వాల రచనగా...
అందూలోనూ ఉపకధలూ, పిట్టకధలూ నిండిపోయి...
కొన్ని వందల వ్యక్తిత్వాలూ, వాటి చరిత్రలూ అనే
సందేహాలూ, మరెన్నో సూత్రాలూ వీటన్నిటితో నిండిన విభిన్న అంశాల సమాహారం అది. ఎంతో సుధీర్ఘమైన ఆ పరంపరలో భిన్నత్వంతో కూడిన ఏకత్వం కోసం పాటుపడుతున్న భావనని చాటిచెప్పే భగవానుని స్తుతి అంతర్లీనంగా గోచరిస్తూనే ఉంటుంది. ఇవన్నీ వున్నా కక్షలూ కార్పణ్యాలూ నేరాలూ దోషాలూ ప్రతీచోటా మనకు అందులో దర్శనమిస్తూనే వుంటాయి. ఇంతాచేసి మనకు దానినుండి లభించే ప్రధాన అంశం  కేవలం ఒక రాజ్యం, రెండు భాగాలు. ఇదే.
మరెందుకు భారతం మహాభారతం అయ్యింది? అయినా పరవాలేదు.ఎందుకంటే ఆ రోజుల్లో యుద్దం అనేది రాజుధర్మం కనుక పరిష్కారం తొందరగానే దొరికింది.
మరి...ఈ రోజుల సంగతేంటి?
ప్రజలకొరకు, ప్రజల చేత, ప్రజలే నిర్మించుకున్న ప్రజాస్వామ్య రాజ్యంలో రెండు వర్గాలవారు ఎవరుంటారసలు?
"మా కోసం మేము తయారు చేసుకొని, మాకు మేమే సమర్పించుకుంటున్నాము" అని పూజించుకొనే రాజ్య[గం]ధర్మం ధిక్కరిస్తున్నవారు ఆ ప్రజలుకాక మరింక ఎవరు?
కుల,మత,వర్గ,భాష,ప్రాంతీయ...ఇంకా ఎన్నివుంటే అన్నిరకాల విభిన్నత్వాలకు అతీతంగా ఏర్పడిన వ్యవస్థలో ఉధ్యమం పేరిట తలెత్తుతున్న వివాదాలూ, విధ్వంసాలూ,ఆరోపణలూ ఎవరు? ఎవరిమీద? ఎవరికోసం చేసుకుంటున్న ఉన్మత్తాలు!!!
వీటన్నిటికీ రూపమే ఈ మహాభారత ఉధ్యమం .
మొదట నేనుకూడా ఈ విషయంలో ఏదో ఒక విషయానికి మాత్రమే పరిమితమైపోయిన సంకుచితత్వంతో ఎగిసిపడ్డాను. కానీ, అన్నిటికంటే అత్యున్నతమైన నా అంతరాత్మ నన్ను నిలదీసినప్పుడు...నాలో నిలిచిన ఒకే ఒక్క భావన "నేను ఒక భారతీయుడని"అన్న నిజం. ఆ నిజమే నాతో ఈ రచన రాయటానికి అర్హతనిచ్చింది.అదే భావనతో ఈ రచన చదవండి.  తరువాత మీ అంతరాత్మ ప్రభోధం ఎప్పుడూ మీతోనే వుంటుందిగా.ఆలోచించండి.
20 ఆగస్ట్  బుధవారం ఇక్కడే మొదటిభాగం కోసం కలుద్దాం.
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం. 




 





Thursday, August 15, 2013

జెండాపండుగ


 నా దేశపు వీధిబడికి మళ్ళీ వచ్చేసింది జెండాపండుగ
వృద్ధాప్యం దరిచేరిన ఊపిరిలా జెండాకర్ర వొణికిపోతుంది,
మూడురంగులూ ముచ్చటగా నింపారు
శాంతిచక్రాన్నిమాత్రం ఎక్కడో వదిలేశారు,
ఏమయిందంటూ వెదుకుతూవెళ్ళాను...
వీధిమలుపులో చెత్తకుండీనిండా తగలబడుతున్నాయి
రాత్రి మతఘర్షణల్లో ముగిసిన జీవితాల కాష్టాలు..
ఆ కుళ్ళుభరించలేక మరోవైపు కదిలాను,
గరిక పిలిచింది "గ్రామం ఇటుందని"
ఆశల గాలితెరలు ఊతంగా నిలవగా
పొలాలచేతులుపట్టుకొనినడిచానటువైపు
ఏముందక్కడ?
స్వఛ్చమైన ఆప్యాయతలుపూరిగుడిశె చూరులో చిక్కుబడిపోయాయి
తాత కాల్చి వదిలేసిన చుట్ట ముక్కలా?
ఆ తపోభంగం నన్ను అక్కడ వుండ నివ్వక మళ్ళీ రొడ్డెక్కాను...
ఏ దిక్కున నిలబడి చూసినా...
ఇప్పుడిక్కడ భారతదేశం కనిపించనివ్వటంలేదు,
ఎవడికి కావలసిన పీలికనివాడే చీల్చుకుంటున్నాడు.
నాయకులు నయవంచకులవుతుంటే...
నమ్మకాలు నడిరోడ్డుపై ఉరితీయబడుతున్నాయి,

శాంతి ఎక్కడుందనిపించగా..
ఇంకెందుకులే అశోకచక్రం అనుకుంటూ వెనుదిరగబోయాను.
నా సణుగుడు వినిపించిందేమో...
ఓ లేతగుండె స్ఫందించింది
ఆగమని సైగచేసి భుజంపైనున్న బడిబస్తాను క్రిందకి దించి
ఆ కమ్మని హృదయపు రంగులపెన్సిళ్ళతో...
లేతనైన ఆశల మునివ్రేళ్ళతో గీసిచ్చింది అశోకచక్రాన్ని
"అంకుల్, మా కోసం ఇది అంటించండంటూ..."
శ్రీఅరుణం
విశాఖపట్నం



Thursday, August 8, 2013

కవిత్వం రాయాలంటే

కవిత్వం రాయాలంటేకలానికి కన్నులు మొలవాలి
అవి వీక్షించే కలలనే
కాగితం కవ్గిలించుకుంటుంది,
కనుమరుగవని ఙ్ఞాపకాల నిధులు
రాతలుగా వరసలు కడతాయి,
కావ్యరసం వొలికిపోతూ..హృదయపుజిహ్వకు
దాసోహమవుతుంది,
అప్పుడే కవిజన్మిస్తాడు.
జలగలా మారిన వంచన
హృదయపుమూలుగులోంచి తడిని
పీల్చిపారేస్తుంటే..
పాలిపోయిన కళ్ళు గ్రుడ్డివైపోయాయి,
ఆశల వెలుగులో విరజిల్లిన
కల్పనల కాంతులు
కనుల ముందు వికటాట్టహాసం చేస్తూ..
ప్రేలిపోయాయి,
చేతులలోని పాపాయిని లాగేసుకున్నట్లు..
స్వార్ధం నమ్మకాన్ని భేర్లు కమ్మించింది.
ఆ ప్రళయానికి ..
ఆలోచనలకు పక్షవాతం వచ్చి
మస్తిష్కం మొద్దుబారిపోతుంది,
ఇక అంతా శూన్యం!
కలం,
కాగితం,
కల్పన,
కవిత్వం.


మీ శ్రీఅరుణం.

Wednesday, July 31, 2013

సోదరా......వెళ్ళొద్దూ...


అబ్బా!పెరికేశావా...
ఒక కంటిలో నలుసుపడిందని చూపిస్తే
రెండుకళ్ళనూ నరికేసి దూరంగా విసిరేశావా.
ఎన్నివేల సంవత్సరాలుగా కూర్చుకున్న అక్షరాలకు
తెలుగుతల్లివని రూపం ఇచ్చి
నేనే పసిపాపనై..నిన్ను పూజించుకున్నానే,
అలాంటిదిప్పుడు
నాలో ఎక్కడో లోపంవుందని...నిలువునా నరికేయటం...
నైతికమా? నీచమా?
నిన్ను చీల్చటానికి ఎందరో నడుంకట్టారు,
రాజులున్నారు
పేదలున్నారు
గురువులున్నారు
విధ్యార్ధులున్నారు
అందరితోకలిసిపోయిన దొంగలూ వున్నారు.
ఇప్పుడు నువ్వు చంపబడింది ఆ దొంగల చేతిలోనేకావటం మాత్రం నిజంగా ధారుణం.
ఇది నిజంగా అవసరమా?
పాలు చాలటంలేదని అమ్మ స్తనాల్ని రెండుగా చీల్చినట్లుంది నీ విభజన
ఆశలు అఖండజాతిని ముక్కలు చేస్తుంటే...
అవసరాలు సమగ్రతని నాశనం చేస్తున్నాయి...
అటువారైనా, ఇటువారైనా...అమ్మమీద ఒట్టేసి చెప్పండి
ఇదంతా సాటిమనుషుల మంచికోసమే చేశారా?
మరి ఎటువైపైనా ఎందుకు ఆత్మహత్యలు కొనసాగుతూనేవున్నాయ్?
పిచ్చికుక్కల పైశాచికత్వానికి
రాజకీయపు క్యాబరేనాట్యం కలగలసి చేసిన దోపిడీ చేస్తుంటే..
58రోజుల ఆమరణ సమైక్యంకోసం ఎన్నికోట్ల రక్తపు కట్టేలలో చలనం రాలేదెందుకని?
ఓట్ల ఎంగిలి విస్తరాకులు పంచుకోవటానికి
అంగలార్చిన కాకులు నడిపిన కుళ్ళినమాంసపు పంపిణీలా
అమృతం లాంటి తెలుగుగడ్డ విరిగిపడిపోయింది.
ఏప్రాంతమైనా నాకనవసరం, నేను మొదట భారతీయుడ్ని...
ఓట్ల అంగడిలో మానాల్ని అమ్ముకుంటున్న రాజకీయవేశ్యల వొంపులకు
నా మరో సోదరుడు  బలయ్యిపోయాడిప్పుడు,
రక్తపుచుక్కలు కారుతున్న కన్నీళ్ళతో నా సోదరునికి వీడ్గోలు చెప్పలేక చెబుతున్నా నీ మాటల్ని...
జాగ్రత్త...జాగ్రత్త...భారతీయ సోదరా...
రాజకీయబందిపోట్లు దేశంలో నిండిపోయారు
వాళ్ళ బొక్కసాలు నింపుకోవటానికి నీ ఇంటిని నాశనం చేస్తున్నారు
ఆ పిశాచాల అరుపులను నమ్మి నువ్వూ పరిగెత్తకు
ఏదో ఒకరోజు నిన్నే సరిహద్దు అవతల పారేస్తారు.
ఇప్పుడు మా ఇంట్లో జరుగుతున్నదదే...
అదిగో అలాంటివాళ్ళ మాటలు వినే నా  సోదరుడు వెళ్ళిపోతున్నాడు ఇంటిలోంచి....

2013జులై30నాటి రాజకీయ చదరంగానికి బలైన కొందరి ఆశల్ని నేను ఇక్కడ వ్యక్తీకరిస్తున్నాను.ఇందులో నేను అడుగుతున్నది ఏ ఒక్క ప్రాంతానికి సంబందించినది కాదు. సామాన్యుల మనసులలో వున్న బాధకి రూపం ఇవ్వటమే నా ఉద్దేశ్యం.ఆనాడు కలిసివుండటానికి చేసిన 6సూత్రాల పధకానికి బదులుగా ఈ 6 ప్రశ్నల విషయాన్ని ఇప్పుడు కాస్త పరిశీలించండి.
1.నీటి భాగాలు,పదవులు లాంటివాటికంటే ముందు మనిషికి మార్పుతాలుకా సంకేతం నమ్మకం అందించాలి. లేకుంటే తరువాత ప్రక్రియ శాంతియుతంగా సాగలేదు.ప్రజల మనోభావాలు దెబ్బతినటానికి కారణం కూడా అదే ఇప్పుడు.
2. ఉద్యోగాలకోసం ఎదురుచూస్తూ, ప్రకటించిన కొత్త నోటిఫికేషన్లకోసం వేలకువేలు కట్టి రాత్రింబగళ్ళు చదువుతున్న విధ్యార్ధులకు మీరు ఇవ్వబోతున్న నమ్మకం ఏమిటి? ఆ నోటిఫికేషన్లు అలాగే వుంటాయా? రద్దవుతాయా? వుంటే ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? లేకుంటే ఇల్లు, పొలాలూ అమ్మి కట్టిన కోట్ల రూపాయల మా ఫీజులను ఎవరు రికవరీ చేస్తారు?
3.ఆంధ్రా,తెలంగాణాలో వుంటూ అక్కడే తమ జీవితాలను నిలుపుకున్నవారికి మీరు ఏం చేయబోతున్నారు?
4.ఒకేరాష్ట్రంగా వున్నప్పుడే ఆంధ్రప్రాంత,తెలంగాణాప్రాంత ఉద్యోగులని నానా అవమానాలకు గురిచేసినప్పుడు, ఇప్పుడు విడిపోబోయే ప్రకటన పూర్తయ్యేముందు మీరు తీసుకోబోతున్న విధానమేమిటి?
5.పెద్దమనుషుల ఒప్పందాన్ని రాజకీయ అవసరాలకు తుంగలోతొక్కి తెలుగుప్రజలను విడదీసిన పాపం మూటగట్టు కున్న వాళ్ళను మళ్ళీ నమ్మాలంటే మా కోసం మీరు ఏం చేయబోతున్నారు?
6.14రాష్ట్రాలు 28 అయినాయి. అందులో మరొకటి ఇప్పుడు బయలుదేరింది.సరే దేశాన్ని అసలు ఎన్నిరాష్ట్రాలుగా విభజించాలనుకుంటున్నారు? దానికి అంతం లేదా? మన సమగ్రతకోసం ఏదైన చేద్దామన్న ఆలోచనలేదా? వీటికి సంబంధించిన మార్పులపై ఎప్పటికైనా దృష్టి సారిస్తారా? లేకపోతే ఎప్పుడు ఏ రాష్ట్రానికి చెందినవాడిగా నేను మారతానో తెలియని అయోమయంలోనే నేను మిగిలి[పోవాలా?




శ్రీఅరుణం










Sunday, July 21, 2013

ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్


నా ఫ్రెండ్ ఒకడు రాసుకున్నది చూడండి.
వాడికి పసితనంలోనే తండ్రి పోయాడు. పేదరికం. బంధువులెవ్వరూ దగ్గరకు తీయని స్థితి. అమ్మ అడ్డమైన కాళ్ళు పట్టుకొని స్వీపర్ గా జాబ్ సంపాధించుకుంది. ఇంటిలో వాడిది ఒంటరి బ్రతుకే. కనీసం అన్నం తినటానికి కూడా అమ్మ తోడులేని మధ్యాన్నాలెన్నో. రాత్రికి నిద్రమత్తులో అమ్మ తినిపించిన అన్నం రుచి పూర్తిగా తీరేదే కాదు. అలాంటి జీవితంలో దాపరికం లేని తోడు దొరకటమే వాడికన్నీ. అలా పదవ తరగతి పాసయ్యి, ఒక కంప్యూటర్ కేంద్రం లో పనికి కుదిరాడు. అక్కడ పెరిగిన పరిచయాలను వాడు ఎలా రాసుకున్నాడో చూడండి.
మొత్తం ప్రేమించిన అమ్మాయిలు = 70మంది.
వారి అవసరాలకి నన్ను ఉపయోగించుకొనేవారు = 40మంది [అనగా.. వీళ్ళకి నేను ఖర్చుపెట్టేంతవరకూ నాతో వుంటారు. కనుక వీళ్ళని వదిలించుకోవటం తేలికే ].
నా అవసరాలకి పనికొచ్చేవారు = 10 మంది. [ అనగా నాకు కావలినప్పుడు నా అవసరాలు తీర్చటానీకీ ముందుకొస్తారు. కనుక వీళ్ళు నాకు పెట్టుబడిలాంటి వాళ్ళు. వీరిని కాపాడుకోవాలి]
మరో 10 మంది కేవల టైం పాస్ రకాలు. [ అంటే సినిమాలకీ, తింటానికీ వచ్చేవారు]
మిగిలిన వారిలో అయిదుగురు = పెళ్ళైన వారుకనుక, వారి గురించి పెద్దగా నావైపునుండి ఆలోచనలుండకూడదు]
ఇక చివరి అయిదుగురూ మాత్రం నన్ను ప్రాణంగా చూసుకొనేవారు. నా అమ్మా,నాన్నల వలన దూరమైనది వారిదగ్గరే దొరుకుతుందికనుక, ఎంత కష్టమైనా వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.]
ఇలాంటి అనేక జీవితాల అనుభవలసారంతో october మొదటి వారంలో విడుదలవుతున్న నా పుస్తకం ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్ లో చదవండి.
శ్రీఅరుణం 

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.